శేరిలింగంపల్లి :నియోజకవర్గంలోని శ్రీ కృష్ణ కాలనీలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు నలగండ్ల టీఆర్ఎస్ నాయకుడు మంత్రిప్రగడ సత్యనారాయణ రూ. 20 వేల ఆర్ధిక సహాయాన్నిప్రకటించారు. మంగళవారం ఆయన జన్మదినం సందర్భంగా ఆ మొత్తాన్ని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీకి అందజేశారు.
పుట్టినరోజు సందర్భంగా తన వంతు సహాయంగా కాలనీలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకుఆర్ధిక సహాయాన్ని అందజేయడం అభినందనీయమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ కాలనీ అధ్యక్షుడు లక్ష్మణ్, కాలనీ వాసులు రాజు, మహాదేవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.