అత్తాపూర్ : అత్తాపూర్ డివిజన్లోని మణికంఠభక్త సమాజం ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి మండపంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కరోనా మహ్మామారి నుంచి ప్రజలను కాపాడాలని ఆయన వినాయకుడిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ ఏసీపీ సంజయ్కుమార్, సీఐ కనకయ్య సమాజం సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.