శంషాబాద్ రూరల్ : మెరుగైన వైద్యమందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. గురువారం మండలంలోని హమీదుల్లానగర్ కుమార్ యాదవ్, రాఘవేందర్, కుమ్మరి యాదయ్యలకు ఒక్కొక్కరికి రూ.60 వేల చొప్పున సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు వైద్య ఖర్చుల కోసం సహాయం అందించడంతో పాటు వారి ఆరోగ్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకుంటూ పూర్తి భరోసానిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో శంషాబాద్ ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కే.చంద్రారెడ్డి, నీరటి రాజు, సర్పంచ్లు సతీశ్యాదవ్, నర్సమ్మ, శేఖర్రెడ్డి, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు ఎనివాస్, విద్యాచరణ్, సత్యనందం, శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.