వనపర్తి, జనవరి 3 : పోరాడి సాధించుకున్న స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ వ్యవసాయానికి వన్నె తీసుకొచ్చారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. రైతుబంధు వారోత్సవాలపై సోమవారం హైదరాబాద్లోని మినిస్టర్స్ క్వార్టర్స్ నుంచి వనపర్తి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సం దర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ రైతుల కోసం సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి ఎనలేనిదని, ఇది చారిత్రక సందర్భమని, ప్రపంచానికి చాటాల్సిన అవసరం ఉందన్నారు. 70 ఏండ్లలో ఎన్నడూ చూడని పథకాలను అమలు చేస్తున్నారన్నారు. గడిచిన ఏడు ఏండ్లల్లో ఎన్నో గొప్ప గొప్ప పథకాలు పురుడుపోసుకున్నాయని చెప్పారు. ఒకప్పుడు 20, 30 ఎకరాలు ఉన్న రైతు కూడా రేషన్ బియ్యం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉండేదని.., సమైక్య రాష్ట్రంలో అత్యంత ఎక్కువ నష్టపోయింది పాలమూరు జిల్లానే అని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో నేడు రైతుల పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, వ్యవసాయ రంగం, అనుబంధ రంగాలు బలోపేతమయ్యాయన్నారు. 8వ విడుత రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో ఇప్పటికే రూ.5 వేల కోట్లు జమయ్యాయని, ఈనెల 10వ తేదీ వరకు అందరి ఖాతా ల్లో డబ్బులు పడతాయన్నారు. 8 విడుతల్లో రూ.50,682 కోట్లు సాయం అందించామని తెలిపా రు. ప్రపంచంలోని ఏ ప్రభుత్వమూ ప్రత్యక్షంగా రైతులకు ఇన్ని డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి రైతుబంధు పథకమే స్ఫూర్తి అని వివరించారు. సోమవారం నుంచి 10వ తేదీ వరకు రైతుబంధు వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలన్నారు. ప్రధానంగా గ్రామాల్లో మారిన రైతు పరిస్థితి, వ్యవసాయ శాఖ ముఖచిత్రాలపై ము గ్గులు వేయాలని, ఎక్కడికక్కడ సృజనాత్మకతను ప్రదర్శించి తెలంగాణ వ్యవసాయ విజయాలను ప్రపంచానికి చాటాలన్నారు.