మహేశ్వరం : అన్ని కులాలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మహేశ్వరం హొలియదాసరి సంక్షేమ సంఘం భవనానికి 15 లక్షల ప్రొసిడింగ్ కాఫీని మహేశ్వరం మండల నాయకులతో కలిసి సంఘం సభ్యులకు ఆమె అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే అన్నికులాలకు, మతాల వారికి సముచిత స్థానం కలిపిస్తున్నామని ఆమె అన్నారు. తెలంగాణలో ఉన్న అన్ని కుల వృత్తులకు అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుం టుందని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ రంగంలో అన్నింటా ముందు వరుసలో ఉందని ఆమె అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి నాయకులు కూనయాదయ్య నాయకులు కరోళ్లచంద్రయ్యముదిరాజ్, మునగపాటి నవీన్, నిమ్మగూడెం సుధీర్, హొలియదాసరి సంఘం అద్యక్షులు బి. సత్యనారాయణ, ఉపాద్యక్షులు అంజయ్య, బాల్రాజ్, కటికెల పరమేష్, సత్తయ్య, అంజయ్య, నర్సింహ్మ, సత్యం, యాదయ్య పాల్గొన్నారు.