పహాడీషరీఫ్ : అన్ని వర్గాల ప్రజా సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు కట్టుబడి ఉందని సమస్యలు పరిష్కరించ డమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని డ్రీమ్సిటీ, గ్రీన్సిటీ ముంపు ప్రాంతాలలో పర్యటించారు. ఉస్మాన్నగర్ చెరువు ప్రాంతాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వంద సంవత్సరాలలో ఎన్నడు లేని విధంగా గత సంవత్సరం నుంచి భారీ వర్షాలు కురిసిన సమయంలో హైదరాబాద్లో ఫిరంగి నాలా పరిసర ప్రాంతాలలో సుమారు 40వేల కుటుంబాలు ముంపు సమస్యను ఎదుర్కొంటున్నాయన్నారు. ఎస్ఎన్డీపీ ప్రాజెక్ట్ కింద ముంపు సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం రూ. 850 కోట్ల బడ్జెట్ కేటాయించిందన్నారు.
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని డ్రీమ్సిటీ, గ్రీన్సిటీ, నబిల్కాలనీ, ఉస్మాన్ నగర్ ముంపు సమస్యల కోసం రూ. 15 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. నెల రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తికాగానే పనులు ప్రారంభమవుతాయన్నారు. వచ్చే వర్షాకాలం లోపు హైదరాబాద్ మహానగరంలో ఉన్న ముంపు సమస్యలన్నింటికి ప్రభుత్వం పరిష్కరిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో జల్పల్లి మున్సిపాలిటీ చైర్మన్ అబ్దుల్లా సాది, కో – ఆప్షన్ మెంబర్ షరీఫ్ ఉస్మాన్బిన్ హసన్ గాలెబ్, డీఈ వెంకటేశ్వరరావు, కౌన్సిలర్లు అహ్మద్ కసాది, జాఫర్బామ్, జింకల్ రాధిక, షేక్ అలీం, టీఆర్ఎస్ నాయకులు చల్వాది రాజేశ్, డ్రీమ్సిటీ, గ్రీన్సిటీ వాసులు మహ్మద్ బేగ్, అలీ యాఫై, జావీద్, సలీం తదితరులు పాల్గొన్నారు.