నెరవేరిన సీఎం కేసీఆర్ హామీ
వికారాబాద్ జిల్లాలో 634 మందికి లబ్ధి
రంగారెడ్డి జిల్లాలో 500మందికి పైగా..
హర్షం వ్యక్తం చేసిన ఉద్యోగులు
పరిగి/ఇబ్రహీంపట్నం, నవంబర్ 27 : సమగ్ర శిక్ష అభియాన్, కేజీబీవీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను ప్రభుత్వం 30శాతం పెంచింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా జీవో నెంబర్ 117ను విడుదల చేశారు. పెరిగిన వేతనాలు 2021 జూన్ 1వ తేదీ నుంచి వర్తింపజేయనుండగా జూలై వేతనంతో కలిపి ఇవ్వనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో వికారాబాద్ జిల్లా పరిధిలో 634 మందికి, రంగారెడ్డి జిల్లాలో సుమారు 500మందికి లబ్ధి చేకూరనున్నది. వేతనాల పెంపుపై సదరు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
సమగ్ర శిక్షా అభియాన్, కేజీబీవీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని, పీఆర్సీని వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన నేపథ్యంలో 30శాతం వేతనాలు పెంచుతూ రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా జీవో 117ను జారీ చేశారు. పెరిగిన వేతనాలు 2021 జూన్ ఒకటి నుంచి అమలులోకి రానుండగా.. జూలై వేతనంతో కలిపి ఇవ్వనున్నారు. దీంతో వికారాబాద్ జిల్లా పరిధిలో 634 మందికి, రంగారెడ్డి జిల్లా పరిధిలో సుమారు 500 మందికి లబ్ధి చేకూరనుంది. ప్రస్తుతం ఎంఐఎస్ కో ఆర్డినేటర్లకు రూ.15వేలు, కంప్యూటర్ ఆపరేటర్లకు 14వేలు, సీఆర్పీలకు 15వేలు, కేజీబీవీ ఉపాధ్యాయులకు 20వేలు, ఐఈఆర్పీలకు 15వేలు, పీటీఐలకు 9వేలు, డీఈవో(ఎస్ఎస్) ఉద్యోగులకు 15వేలు, మెసెంజర్లకు రూ.10వేల వేతనం చెల్లిస్తున్నారు. గత ప్రభుత్వాల హయాంలో కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేసేవారని, సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సైతం పీఆర్సీ వర్తింపజేసి, ఉద్యోగులకు పెంచిన విధంగానే తమకు అదే స్థాయిలో వేతనాలు పెంచడం హర్షణీయమని వారు పేర్కొంటున్నారు. చిరుద్యోగులను పట్టించుకున్న ప్రభుత్వం ఇదేనని వారు తెలిపారు.
2020 పీఆర్సీ ప్రకారం వేతనాలు పెంచేందుకు సమగ్ర శిక్షా అభియాన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. దీనికనుగుణంగా 30 శాతం వేతనాలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్ర శిక్షా అభియాన్లో పాఠశాల, క్లస్టర్, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్తో పాటు కస్తూర్బా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలు పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. శనివారం నిర్ణయం తీసుకోవడంపై ఉద్యోగులందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో 634 మందికి..
జిల్లాలోని కేజీబీవీలలో 396 మంది, డీఈవో(ఎస్ఎస్) ఉద్యోగులు 5గురు, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్లు 12, కంప్యూటర్ ఆపరేటర్లు 17, సీఆర్పీలు 60, మెసెంజర్లు 17, ఐఈఆర్పీలు 27, పీటీఐలు 100 మంది పనిచేస్తున్నారు.
30 శాతం పీఆర్సీ ఇవ్వడం అభినందనీయం
వేతన పెంపు హర్షణీయం
ప్రభుత్వం గుర్తించినందుకు ధన్యవాదాలు
మంచి రోజులొచ్చాయి
వేతనాలు పెంచడం ఎంతో సంతోషంగా ఉంది