శంషాబాద్ రూరల్ : పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు అండగా రాష్ట్ర ప్రభుత్వం ఉందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయంలో షాదీముబాకర్, కల్యాణలక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమం తహసీల్దార్ జనార్ధన్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ 43 మంది లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడలేని విధంగా తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేసి మంచి గుర్తింపు తీసుకువస్తున్నారని వివరించారు. కల్యాణలక్ష్మీ, మిషన్భగీరథ, మిషన్కాకతీయ, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెంచన్లు తదితర వాటిలో ప్రజలకు ఎంతోమేలు జరుగుతుందన్నారు.
కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మ,జడ్పీటీసీ నీరటి తన్విరాజు, వైస్ ఎంపీపీ నీలంనాయక్, నార్సింగి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, ఎంపీడీవో వినయ్కుమార్,సర్పంచ్లు దండుఇస్తారి,సునిగంటి సిద్ధులు, రాజ్కుమార్, రామ్గోపాల్, కోడురు నర్సమ్మ,కామోనబాయి లక్ష్మయ్య,ఎంపీటీసీ యాదగిరి, లబ్ధిదారులు పాల్గొన్నారు.