మహబూబ్నగర్, జనవరి 5 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : కంచే చేను మేసిన చందంగా వ్యవహరించిన మహబూబ్నగర్ కౌన్సిలర్ బురుజు సు ధాకర్రెడ్డిని టీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. అభివృద్ధే ధ్యేయం గా పనిచేస్తున్న అధికార పార్టీకి ఇలాంటి అవినీతిపరుల వల్ల చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని.. అం దుకే సస్పెండ్ చేసినట్లు రాజకీయ విశ్లేషకులు పే ర్కొంటున్నారు. తప్పు చేస్తే ఎవరినీ సహించదని.. సొంత పార్టీ వారిని కూడా వదిలేది లేదని గట్టి హె చ్చరిక జారీ చేసినట్లు చర్చించుకుంటున్నారు. తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని భావించి కౌన్సిలర్గా గెలిపిస్తే ప్రజలు, ప్రభుత్వ ఆస్తులను కబ్జా చే యడంతోపాటు దొంగనోట్ల కేసులోనూ అరస్టైన వ్యక్తిని పార్టీ నుంచి సాగనంపి టీఆర్ఎస్ పార్టీ మం చి సందేశమే ఇచ్చిందని పేర్కొంటున్నారు. సెటిల్మెంట్లు, భూకబ్జాలు చేసే వారిని పార్టీలో ఉంచుకుంటే ప్రజల్లో అభిమానం సన్నగిల్లే అవకాశం ఉం దని.. అందుకే ఇలాంటి వారిని సాగనంపి అధికార పార్టీ భవిష్యత్లో ఎలా ఉండబోతోందో స్పష్టంగా వెల్లడించింది.
సీనియర్ నాయకుడు కావడంతో గత మున్సిప ల్ ఎన్నికల్లో 43వ వార్డు కౌన్సిలర్గా సుధాకర్ రె డ్డికి పోటీ చేసేందుకు అధికార పార్టీ అవకాశం ఇ చ్చింది. విజయం సాధించిన తర్వాత అభివృద్ధిపై దృష్టి సారించాల్సింది పోయి అక్రమాలకు అలవా టు పడ్డారని పార్టీ నేతలు తెలిపారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారని కొందరితో డబ్బు లు డిమాండ్ చేసిన సుధాకర్రెడ్డి వీడియోలు వై రల్ అయ్యాయి. దొంగ నోట్ల కేసులో సెటిల్మెంట్ చేయబోయి అరెస్టయ్యారు. ఈ వ్యవహారంతో సు ధాకర్రెడ్డి తీరుపై పార్టీ కఠిన చర్యలు తీసుకున్నది. అరెస్ట్ కావడంతో సుధాకర్రెడ్డి బాధితులు ఒక్కొక్కరుగా వచ్చి తమకు జరిగిన నష్టాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా రాంనగర్ హైస్కూల్ కు చెందిన 680 గుంటలు అక్రమంగా తన పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారంలోనూ అడ్డంగా బుక్కయ్యారు. సాక్షి సంతకం కోసం రిజిస్ట్రార్ ఆఫీస్కు తీసుకెళ్లి బాలరాజు అనే వ్యక్తి ద్వారా పాఠశాల స్థలాన్ని కైవసం చేసుకున్నారు. దీనిపై లోక్ అదాలత్కు ఫిర్యాదు అందడంతో రెవెన్యూ అధికారులు విచారణ జరిపి బాధ్యులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులోనూ సుధాకర్రెడ్డిపై కేసు నమోదైంది. ఇలా అనేక అంశాల్లో అక్రమాలకు పాల్పడడంతోనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయా ల్సి వచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీలో మరెవరూ ఇలాంటి ఆలోచన కూడా చేయొద్దనే గట్టి సందేశాన్ని పార్టీ ఇచ్చిందని నేతలంటున్నారు.
అవినీతిపరులకు స్థానం లేదు..
ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్లో అంద రూ ఎంతో క్రమశిక్షణ గల కార్యకర్తలే. సీఎం కేసీఆర్ నుంచి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వరకు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. కానీ కౌన్సిలర్ బురుజు సుధాకర్రెడ్డి మాత్రం ప్రజలకు సేవ చేయాల్సింది పోయి అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారు. ఆయన అవినీతికి సం బంధించిన వీడియోలు సైతం వైరల్ అయ్యా యి. పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే ఇలాంటి వ్యక్తులను టీఆర్ఎస్ పార్టీ సహించబోదు. ఆయన వ్యవహార శైలి మార్చుకోవాలని గతంలోనే పలుమార్లు హెచ్చరించినా మార్పు రా లేదు. ఇలాంటి వాళ్లు పార్టీలో ఉంటే పార్టీకే మచ్చగా భావించి ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశాం. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల టీఆర్ఎస్ పార్టీ ఎంతో అప్రమత్తంగా ఉంటుంది. – బాద్మి శివకుమార్,
టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు