బండ్లగూడ : అతివేగంతో నిర్లక్ష్యంగా కారు నడిపి డివైడర్ను ఢీ కొట్డడంతో కారు బోల్తా పడిన సంఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బహుదూర్పూరకు చెందిన అహ్మద్, షోహెల్, ఫైజల్, షేక్ మజిద్లు (టీఎస్ 07జిఎం 4722,మారుతి) కారులో సన్సిటీలో ఉండే తమ స్నేహితుడిని ఇంటి వద్ద వదిలి తిరిగి బహుదూర్ పూరకు వెళ్తున్నారు. అర్మిస్కూల్ గేటు మందుకు రాగానే వారు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా డివైడర్ను ఢీ కొట్టింది.
దీంతో కారు కొంత దూరం వెళ్లి బోల్తా పడిపోగా అందులో ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలు అయ్యాయి. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని స్థానిక అస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.