మియాపూర్ : గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన సంఘటన బుధవారం మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..మియాపూర్ కల్వరి టెంపుల్ పరిసర ప్రాంతాల్లోని టాయిలెట్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి (48) పడి ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.
మృతి చెందిన వ్యక్తిని పరిశీలించగా అతను వద్ద ఉన్న బ్యాగులో చూడగా జాన్ విద్యాసాగర్ తండ్రి దేవదాస్ అని రాసి ఉన్నట్లు గుర్తించారు. అతను అనారోగ్య కారణంతో కాని గుండెపోటు వంటి కారణంతో మృతది చెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.