బేగంపేట్: ఫుట్పాత్పై నిద్రిస్తున్న ఓ వృద్ధుడు అనారోగ్యంతో మృతి చెందిన ఘటన రాంగోపాల్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. డిటెక్టివ్ ఇన్స్ పెక్టర్ కాశీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్ పీజీ రోడ్డులోని అనంతయ్య క్లీనిక్ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుని గురించి ఆరా తీయగ స్థానికంగ బిక్షాటన చేస్తుంటాడని తెలిసింది. మృతున్ని పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుని ఒంటిపై పసువు రంగు షర్టు,నలుపు రంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతునికి సంబంధించిన బంధుమిత్రులు రాంగోపాల్పేట్ పోలీసులను సంప్రదించాలని పోలీసులు కోరారు.
మరో ఘటనలో హుస్సేన్ సాగర్ నీటిలో తేలియాడుతున్న గుర్తు తెలియని ఓ వ్యక్తి మృత దేహాన్ని రాంగోపాల్పేట్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ట్యాండ్బండ్ చిల్డ్రన్స్పార్కు దగ్గర సాగర్ నీటిలో ఓ వ్యక్తి మృతదేహాం ఉన్నట్టు పెట్రోలింగ్ పోలీసులు గుర్తించారు.
ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నీటిలో ఉన్న మృతదేహాన్ని వెలికి తీసి పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. మృతుని ఒంటిపై గ్రీన్ కలర్ టీ షర్టు పసుపు రంగు ట్రాక్ ప్యాంట్ ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. మృతునికి సంబంధించిన బంధు మిత్రులు రాంగోపాల్పేట్ పోలీస్స్టేషన్లో సంప్రదించాలని డీఐ కాశీ తెలిపారు.