తెలుగుయూనివర్సిటీ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత సినిమాలల్లో తెలంగాణ భాషకు స్థానం పెరిగిందని తెలంగా ణ సారస్వత పరిషత్తు అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తులో ప్రముఖ సాహితీ వేత్త డాక్టర్ తిరుమల శ్రీనివాసాచార్య ఆయన సతీమణి తిరుమల స్వరాజ్యలక్ష్మి పేరిట ఏర్పాటు చేసిన సాహితీ పురస్కా రాన్ని ప్రముఖ రచయిత్రి నెల్లుట్ల రమాదేవికి మంగళవారం పరిషత్తులో జరిగిన కార్యక్రమంలో ప్రధానం చేశారు.
పురస్కారం కింద 5వేల నగదు, జ్ఞాపిక, శాలువాతో ఘనంగా సత్కరించారు. సినిమా శక్తివంతమైన సాధనమని శివారెడ్డి పేర్కొన్నారు. గతంలో ఆంధ్రప్రాంత రచయితలు తెలంగాణ మాటలకు ప్రాధాన్యం ఇవ్వకుండా పనిమనుషులు, విలన్లకు మాత్రమే పెట్టేవారని ఆయన వివరించారు.
త్వరలో తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో సాహిత్య సాంస్కృతికోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యావేత్త, రచయిత్రి డాక్టర్ జి. అమృతలత మాట్లాడుతూ కథ, కవిత, వ్యాసం, నాటిక, కార్టూన్ వంటి ప్రక్రియలల్లోనే గాకుండా వ్యాఖ్యానంలో కూడా నెల్లుట్ల రమాదేవిది అందెవేసిన చెయ్యని ప్రశంసించారు.
పురస్కారగ్రహీత రమాదేవి ఈ సందర్బంగా తెలుగు సినిమా పాటల్లో తెలంగాణ పదప్రయోగాలు అనే అంశంపై ప్రసంగించా రు. తెలంగాణ పదాలను సినిమా పాటలలో వాడడంలో డాక్టర్ సి.నారాయణరెడ్డి ఆధ్యులని వివరించారు. డాక్టర్ తిరు మల శ్రీనివాసాచార్య, పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జె. చెన్నయ్య, కోశాధికారి మంత్రి రామారావు పాల్గొన్నారు.