ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
ఘనంగా రైతుబంధు సంబురాలు
సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
శంషాబాద్ రూరల్, జనవరి 9: రైతులను ఆదుకోవడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. ఆదివారం మండలంలోని పాలమాకులలో పీఏసీఎస్ చైర్మన్ శ్రావణ్గౌడ్ ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ పెట్టుబడి సాయం కింద రైతు బంధు పథకాన్ని తీసుకువచ్చి రూ. 50 వేల కోట్లు రైతులకు అందించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. శంషాబాద్ మండలంలోనే ఇప్పటి వరకు రూ.50 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమచేశామని, రైతు బీమా ద్వారా 108 మందికి రూ. 5 కోట్ల 40 లక్షలు అం దజేసినట్లు తెలిపారు. అంతకు ముందు చైర్మన్ శ్రావణ్ గౌడ్ మాట్లాడుతూ ధాన్యాన్ని నిల్వ చేసుకోవడానికి పెద్దషాపూర్లో రెండు ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. పీఏసీఎస్ ప్రహరీకి నిధులు కేటాయించాలని కోరారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీ రాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జయమ్మశ్రీనివాస్, జిల్లా పరిషత్ ఫ్లోర్లీడర్ నీరటి తన్విరాజు, వైస్ ఎంపీపీ నీలంనాయక్, మండలాధ్యక్షుడు చంద్రారెడ్డి, ప్రధాన కార్యదర్శి మోహన్రావు,మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్ గౌడ్, సర్పంచ్ సతీశ్యాదవ్, ఎంపీటీసీలు సరిత రవీందర్, ఇందిరాదేవి,నాయకులు రవీందర్నాయక్, శ్రీనివాస్యాదవ్,ఉప సర్పంచ్ ప్రవీణ్గౌడ్, గూడలకృష్ణాగౌడ్, వైస్చైర్మన్ చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.