మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్
నియోజకవర్గంలో అభివృద్ధి పనులు ప్రారంభం
అమీర్పేట్, నవంబర్ 27 : ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొని నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తున్నానని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. శనివారం సనత్నగర్ డివిజన్లో రూ. 1.50 కోట్లతో చేపట్టిన కమ్యూనిటీ హాళ్లు, ఓపెన్ ఎయిర్ జిమ్లు, వ్యాయామ శాలలను కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డితో కలిసి ప్రారంభించారు. సుందర్నగర్ కాలనీ పార్కులో రూ. 13.20 లక్షల తో చిన్నపిల్లలు ఆడుకునేందుకు ఆట పరికరాలతో పాటు పెద్దల కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ ఎయిర్ జిమ్లను కాలనీ అధ్యక్షుడు మాచర్రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం సుభాశ్నగర్లో రూ. 46.90 లక్షల తో గ్రౌండ్తో పాటు మొదటి అంతస్తులతో నిర్మితమైన కమ్యూనిటీ హాలును కాలనీ మహిళలతో కలిసి ప్రారంభించారు. సనత్నగర్ బస్టాండ్ సమీపంలో గ్రౌండ్ ప్లస్ మొదటి అంతస్తులతో నిర్మించిన వాల్మీకి వ్యాయామశాలను ముఖ్య కోచ్ రవి బిడ్లాన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ సనత్నగర్ నియోజకవర్గంలో 30 ఏండ్లలో కాని అభివృద్ధి కేవలం ఏడున్నరేండ్ల కాలంలో చేసి చూపించానని తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కొలను బాల్రెడ్డి, సయ్యద్ సిరాజుద్దీన్, రాజేశ్ ముదిరాజ్, సురేశ్గౌడ్, సంతోష్ సరఫ్ పటేల్, కరుణాకర్రెడ్డి పాల్గొన్నారు.