మియాపూర్ : పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడు స్వచ్చంద సంస్థలు సైతం తమ వంతు సాయం అందించేందుకు ముందుకు రావటం అభినందనీయమని ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ పేర్కొన్నారు.
సామాజిక సేవలో భాగంగా విద్యార్థులకు అందిస్తున్న చేయూత వారికి వరం లాంటిదని, తద్వారా విద్యలో మరింతగా రాణించేందుకు దోహదపడుతుందన్నారు. మియాపూర్ డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సినాప్సీస్ అనే సాఫ్ట్వేర్ సంస్థ సౌజన్యంతో నిర్మాణ్.ఓఆర్జీ సంస్థ ఆధ్వర్యంలో రూ. 6 లక్షల విలువ చేసే 50 డిజిటల్ ట్యాబ్లను విద్యార్థులకు కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్తో కలిసి విప్ గాంధీ మంగళవారం పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనా వంటి సమయంలో పేద విద్యార్థులకు చదువు దూరం కాకుండా…ఆన్లైన్ క్లాసులు వినేందుకు ఈ పరికరాలు ఎంతగానో దోహదపడతయన్నారు. పేద విద్యార్థుల పరిస్థితులను గుర్తించి వారి విద్యా భ్యాసానికి విలువైన పరికరాలు సీఎస్ఆర్ కింద అందించిన సినాప్సీస్ సంస్థ నిర్వహకులను విప్ గాంధీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో సినాప్సీస్ సంస్థ ప్రతినిధులు నరేంద్ర,నర్సింహా, అనూరాథ, భార్గవ్ రామ్, భగవాన్, ఎంఈవో వెంకటయ్య, ప్రధానోపాధ్యాయురాలు వసుంధర,బాల్రెడ్డి, శేఖర్, మంజుల, టీఆర్ఎస్ నాయకులు పురుషోత్తం , మోహన్, ఎండి అన్వర్ షరీఫ్, గంగాధర్, గోపాల్, కిరణ్,మహేందర్, శ్రీనివాస్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.