బండ్లగూడ : బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుక్కల బెడద ఎక్కువ కావడంతో ఇటీవల కమిషనర్ వేణుగోపాల్రెడ్డి కుక్కలను పట్టుకుని వాటికి శస్త్రచికిత్స చేసేందుకు బ్లూక్రాస్ సోసైటీ సభ్యులతో ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు వారు మంగళవారం నుంచి కార్పొరేషన్ పరిధిలో కుక్కలను పట్టే చర్యలకు ఉపక్రమించారు.
బ్లూక్రాస్ సోసైటీ సభ్యులు బైరాగిగూడ, గంధంగూడ తదితర ప్రాంతాల్లో కుక్కలను పట్టుకున్నారు. ఈ మేరకు కార్పొరేటర్ చంద్రశేఖర్ పట్టుకున్న కుక్కలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బస్తీల్లో కుక్కల బెడద లేకుండా చేసేం దుకు అధికారులు మంచి చర్యలు తీసుకున్నారని, రాత్రి వేళలో కుక్కలతో ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొనేవారని తెలిపారు.
ఈ విషయంలో బ్లూక్రాస్ సోసైటి వారిని ఆయన అభినందించారు. బ్లూక్రాస్ సోసైటి సభ్యులు మాట్లాడుతూ పట్టుకున్న కుక్కలకు పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్స చేయడంతో పాటు వాటికి వాక్సిన్ వేసి వదిలేస్తామని తెలిపారు.