బడంగ్పేట : బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిరంతరం అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. సోమవారం 7వ డివిజన్లోని స్వామి నారాయణ కాలనీలో అంతర్గత మురుగునీటి పైపులైన్ అభివృద్ధి పనులను ప్రారంభించారు.
అనంతరం స్థానికంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ దశల వారీగా పనులు పూర్తి చేస్తామని ముందు ప్రాధాన్యత డ్రైనేజీ నిర్మాణ పనులను చేప డుతున్నట్లు తెలిపారు. కార్పొరేటర్లు గడ్డం లక్ష్మారెడ్డి, దడిగ శంకర్, ఏఈఈ రాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.