గజ్వేల్లో కనుల పండవగా శ్రీనివాస కల్యాణోత్సవం
పెద్దసంఖ్యలో హాజరైన భక్తజనం
గజ్వేల్, నవంబర్ 27: గజ్వేల్ పట్టణంలో రెండోరోజూ లక్ష దీపోత్సవం వైభవంగా కొనసాగింది. శ్రీనివాస కల్యాణోత్స అజయ్ధీర సింహ ఆచార్యుల బృందం ఆధ్వర్యంలో నిర్వహించారు. వైష్ణవ సంప్రదాయ ప్రకారం కల్యాణాన్ని జరిపించారు. కల్యాణంలో టూరి జం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్గుప్తా, ఇండస్ట్రియల్ డెవలప్మెం ట్ కార్పొరేషన్ చైర్మన్ అమరవాది లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, గజ్వేల్ కోర్టు జడ్జి వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్యశర్మ, గజ్వేల్ జడ్పీటీసీ పంగమల్లేశం పాల్గొన్నారు. కీసర సాయి దత్త పీఠాధిపతి స్వామి రామానంద ప్రభూజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. శృంగేరీ శారదాపీఠ ఆస్థాన పౌరాణికుడు డాక్టర్ బ్రహ్మశ్రీ బాదంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి ఆధ్యాత్మిక ప్రవచనాలు చేశారు. లక్షదీపోత్సవ కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. తిరుపతిలో జరిగిన విధంగా స్వామివారి కల్యాణాన్ని జరిపిం చారు. టూరిజం కార్పొరేషన్ చైర్మన్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, కీసర సాయి దత్త పీఠాధిపతి స్వామి కార్తిక దీపాలను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గజ్వేల్ పట్టణ వేదపండితులు వేదపఠనం చేశారు. సంగీత కళాకారులు ఆలపించిన భక్తి పాటలు అలరించాయి.
హైదరాబాద్లో కన్నా అద్భుతంగా జరిగింది
-శృంగేరీ శారదాపీఠ ఆస్థాన పౌరాణికుడు
డాక్టర్ బ్రహ్మశ్రీ బాదంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి హైదరాబాద్లో కన్నా గజ్వేల్ పట్టణంలో లక్ష దీపోత్సవాన్ని నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని శృంగేరీ శారదాపీఠ ఆస్థాన పౌరాణికుడు డాక్టర్ బ్రహ్మశ్రీ బాదంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి అన్నారు. గజ్వేల్ పట్టణంలో ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించినకు అభినందనలు తెలియజేశారు.
భక్తిమార్గాన్ని అలవర్చుకోవాలి
-కీసర సాయి దత్త పీఠాధిపతి స్వామి రామానంద ప్రభూజీ
ప్రజలంతా భక్తిమార్గాన్ని అలవర్చుకోవాల కీసర సాయి దత్త పీఠాధిపతి స్వామి రామానంద ప్రభూ జీ అన్నారు. ప్రజలంతా సత్ప్రవర్తన, భక్తిని పెంపొందిచుకుంటే ప్రపంచమంతా శాంతియుతంగా ఉం టుందన్నారు. గజ్వేల్లో దీపోత్సవాన్ని అంగరంగవైభవంగా నిర్వహించడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
నేటి కార్యక్రమాలు
గజ్వేల్ పురోహితులతో నేడు సీతారామ చం ద్రస్వామి కల్యాణం నిర్వహించనున్నారు. కార్యక్రమానికి నాచారం గుట్టలోని శ్రీక్షేత్రం పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతీ స్వామి హాజరై భక్తులకు అనుగ్రహ భాషణం చేయనున్నారు. అలాగే, వేంకటేశ్వర భక్తిచానల్ వ్యాఖ్యా త బ్రహ్మశ్రీ పాలెపు చంద్రశేఖరశర్మ ప్రవచనం చేయనున్నారు.