హఫీజ్పేట్: నియోజకవర్గ వ్యాప్తంగా ఇదివరకే యూపీహెచ్సీలతోపాటు ప్రత్యేకంగా ఎంపికచేసిన ప్రాంతాల్లో కొవిడ్టీకాలు అందిస్తుండగా ఈప్రక్రియను మరింత వేగంగా చేసే లక్ష్యంతో జీహెచ్ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త అధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొబైల్వ్యాక్సినేషన్ డ్రైవ్కు విశేషస్పందన లభిస్తున్నది. గురువారం పట్టణప్రాథమిక ఆరోగ్యకేంద్రం హఫీజ్పేట్ పరిధిలో ఏర్పాటుచేసిన ఆయా మొబైల్ టీకా కేంద్రాలలో 913 మందికి టీకాలు అందించినట్లు ఇంచార్జ్ మెడికల్ ఆఫీసర్ డా. వినయ్బాబు తెలిపారు.
సర్కిల్ పరిధిలోని మాదాపూర్, మియాపూర్, చందానగర్, హఫీజ్పేట్ డివిజన్లలో అన్నివర్గాలవారికి అందుబాటులో ఉండేవిధంగా మొబైల్టీకా వాహనాలు ఏర్పాటుచేశామన్నారు. కొవిడ్ మూడవదశ ముప్పుపొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు సంపూర్ణంగా ఈ అవకాశాన్ని వినియోగించుకొని మహమ్మారినుంచి రక్షించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇంచార్జ్ మెడికల్ ఆఫీసర్ డా. వినయ్బాబు, డా. నాగమణి, ఏపీయంఓ రమేష్నాయక్, ల్యాబ్టెక్నిషియన్ పండరీరెడ్డి, కవిత, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.