శ్రీవారి ఖజానాకు రూ.7,35,308
యాదాద్రి, జనవరి 5 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బాలాలయంలో స్వామి, అమ్మవార్లకు అర్చకులు బుధవారం ఉదయం ఆగమశాస్త్ర ప్రకారం విశేష పూజలు నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు స్వామి అమ్మవార్లకు సుప్రభాతం చేపట్టి ఆరాధించారు. అనంతరం పంచామృతాలతో అభిషేకించి, తులసీ ప్రతాలతో అర్చించారు. దర్శనమూర్తులకు సువర్ణ పుష్పార్చన, అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన పూజలు చేపట్టారు. బాలాలయంలోని మహామండపంలో సుదర్శన నారసింహ హోమం, విశ్వక్సేనారాధన, నిత్య తిరుకల్యాణ మహోత్సవాలు ఘనంగా జరిపించారు. రాత్రి ఆరగింపు చేపట్టిన అర్చకులు అనంతరం స్వామికి పవళింపు సేవ నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా బాలాలయంలో అర్చకులు వేద మంత్రాలను పటిస్తూ తిరుప్పావై పూజలు ఘనంగా నిర్వహించారు. గోదాదేవి శ్రీరంగనాయకుడిపై రచించిన పాశురాలలో ఎనిమిదో పాశురాలను అర్చకులు పఠించారు. శ్రీవారి ఖజానాకు రూ.7,35,308 ఆదాయం వచ్చినట్లు ఈఓ గీత తెలిపారు.
శ్రీవారి ఖజానాకు ఆదాయం(రూపాయల్లో)
ప్రధాన బుక్కింగ్ ద్వారా 75,100
రూ. 100 దర్శనం టిక్కెట్ 22,000
వేద ఆశీర్వచనం 4,200
నిత్య కైంకర్యాలు 1,000
సుప్రభాతం 1,700
ప్రచారశాఖ 16,360
క్యారీబ్యాగుల విక్రయం 9,000
వ్రత పూజలు 52,000
కళ్యాణకట్ట టిక్కెట్లు 10,000
ప్రసాద విక్రయం 4,04,650
వాహనపూజలు 6,500
టోల్గేట్ 900
అన్నదాన విరాళ 4,848
సువర్ణ పుష్పార్చన 94,000
యాదరుషి నిలయం 26,380
పాతగుట్ట నుంచి 16,570
గోపూజ 100