మహబూబ్నగర్, జనవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు, రెచ్చగొట్టే ప్రసంగాలు, మతపరమైన విద్వేషాలు సృష్టించే మాటలను పోస్ట్ చేసే వారిని ఎవరూ గమనించడం లేదనే భ్రమల్లో ఉంటే పొరపాటే. ‘నా ఫేస్బుక్.. నా ఇష్టం అంటే కుదరదు.. ఎవరిపై అయినా కామెంట్ చేస్తా.. వాళ్లేమీ వచ్చి చూస్తారా..’ అనుకుం టే పప్పులో కాలేసినట్లే. ఇతరుల మనోభావాలను దెబ్బతీసి, పరువు మర్యాదలకు భంగం కలిగించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కే సులు నమోదు చేసి జైలుకు పంపిస్తున్నారు. జిల్లాకో సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేసి ప్రతీది జాగ్రత్తగా గమనిస్తున్నారు.
సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా..
ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్ట్టాగ్రాం, యూ ట్యూబ్ తదితర వాటిపై నిఘాపెట్టారు. సోషల్ మీడి యా వేదికగా వైరలైన వీడియో ఆధారంగా పోలీసులు కేసులు నమోదు చేస్తారు. కులమతాలు, వర్గాల వారీ గా చేసే విమర్శలు, సోషల్ మీడియా వేదికగా అసభ్యంగా, బాధ్యతారహితంగా, జుగుప్సాకరంగా, మత ద్వేషాలను ప్రజ్వలింపజేయడం, ఫోటోలు, వీడియోలతో మార్ఫింగ్ చేసి వేధింపులకు పాల్పడడం తదిత ర వ్యక్తిగత దాడులు చేస్తున్న వారిపై ఉక్కుపాదం మో పుతున్నారు. జిల్లాలో ఎస్పీ పరిధిలో ప్రత్యేకంగా సోషల్ మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేశారు. గ్రామ స్థాయిలో ఉండే వాట్సాప్ గ్రూపులపైనా నిఘా ఉం టుంది. మహిళలను సోషల్ మీడియా వేదికగా ఇ బ్బంది పెట్టే వారిపై షీ టీమ్స్ గమనిస్తూనే ఉన్నాయి. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై పోలీసులు చట్టరీ త్యా చర్యలు తీసుకునే అవకాశాలు బాగా పెరిగాయి.
కాంగ్రెస్ నాయకుడు జైలుకు..
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూరు లో సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినందు కు దేవరకద్రకు చెందిన కాంగ్రెస్ నాయకుడు కొం డా ప్రశాంత్రెడ్డిపై కొత్తకోట పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఓ సభలో సీఎంను కించపర్చేలా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. సదరు నాయకుడి వ్యాఖ్యలు సోషల్మీడియాలో వైరలయ్యాయి. దీనిపై కొత్తకోటకు చెందిన అ ధికార పార్టీ నేతలు ఆధారాలతో సహా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వి చారణ చేపట్టిన పోలీసులు సదరు నాయకుడిని అరెస్ట్ చేసి కోర్టు లో హాజరుపర్చగా మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్కు పంపారు. ప్రస్తుతం కో ర్టులో విచారణ కొనసాగుతున్నది. ఆధారాలు బలం గా ఉండడంతో ఆ వ్యక్తికి శిక్షపడే అవకాశాలు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. కనీసం మూడేండ్ల జైలు శిక్ష తప్పకపోవచ్చు.
ఫిర్యాదు ఇలా..
సోషల్ మీడియా వేదికగా మనోభావాలు దెబ్బతీసిన వారిపై సమీప పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేయొ చ్చు. సంబంధిత పోలీస్ అధికారికి సోషల్ మీడి యా వ్యాఖ్యలకు సంబంధించిన ఆధారాలను స్క్రీన్ షాట్, వీడియో క్లిప్పింగులు తదితర ఆధారాలు సమర్పించాలి. బాధితులు వాట్సాప్ లేదా ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేసినా.. విచారణ జరిపి
చర్యలు తీసుకుంటారు. పోలీసులు తమ పరిధిలో సామాజిక మాధ్యమాలను క్రమం తప్పకుండా మానిటరింగ్ చేస్తుంటారు. అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు వారి దృష్టికి వస్తే సుమోటోగా కేసులు నమోదు చేస్తారు.
మితిమీరితే కేసులే..
తమ భావాలు, అభిప్రాయాలను పంచుకునేందుకుగానూ కార్యకర్తలు, అభిమానులకు చేరువయ్యేందుకు సోషల్ మీడియా వేదికగా పనిచేస్తున్నది. అయి తే, ఈ వేదికను కొందరు సరైన తీరుగా వినియోగించడం లేదు. కొందరు వ్యక్తులు పరుష పదాలతోపా టు హెచ్చరించే పోస్టులు పెడుతుండడంతో పలుచోట్ల రాజకీయ నేతలు న్యాయపరంగా ఇబ్బందుల్లో పడుతున్నారు. విమర్శలు మితిమీరితే సదరు పోస్ట్ చేసిన వ్యక్తులు జైలుకు వెళ్లాల్సిందేనని పోలీసులు, న్యాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాజీనామాలు డిమాం డ్ చేయడం.. ఎందుకు రాజీనామా చేయాలని ఎదురుదాడికి పరిమితమవ్వడం, రాజకీయం గా అయితే ఏ ఇబ్బందీ ఉండదు. కానీ కొందరు మా జోలికొస్తే ఊరుకునేది లేదని, అంతుచూస్తామనే స్థాయి బెదిరింపులకు దిగడంతోపాటు రెచ్చగొడుతున్నారు. తమకు తామే ఏర్పరుచుకున్న లక్ష్మణరేఖ దాటకుండా ఎన్ని ప్రచారాలు, పోస్టులు పె ట్టినా ఎవరికీ అభ్యంతరాలు ఉండవు. పౌరుల హక్కులకు, ప్రాథమిక స్వేచ్ఛకు భంగం కలిగించకుండా సామాజిక మాధ్యమాలను వినియోగిస్తే ఎవరూ తప్పుపట్టరు. రెచ్చగొట్టే, విద్వేషత ప్రసంగాలు, వ్యాఖ్యలతోనే చిక్కంతా. సామాజిక మాధ్యమాల్లో తమ వ్యా ఖ్యలు ఎవరూ చూడరు అ నే ధోరణి ఏ మాత్రం సరికా దు. తప్పుడు వ్యాఖ్యలు చేస్తే తప్పనిసరిగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నది. సదరు ఫిర్యాదుతో నిందితులు జైలు ఊచలు లెక్కపెట్టే పరిస్థితి ఉంటుంది. అందుకే తస్మాత్ జాగ్రత్త.