వనస్థలిపురం : గత వారం హస్తినాపురంలో యువకుడి చేతిలో ఓ యువతి కత్తిపోట్లకు గురైన విషయం విధితమే. ఆ ఘటన నగరంలో సంచలనం సృష్టంచింది. ఆ ఘాతుకంతో తీవ్ర గాయాలతో హస్తినాపురం నవీన హాస్పిటల్లో చికిత్స పొందిన బాధితురాలు శిరీష (19) గురువారం డిశ్చార్జి అయ్యింది.
వైద్యులు రణధీర్రెడ్డి, రవితేజలు నిర్విరామంగా కృషి చేసి ఎలాంటి శస్త్ర చికిత్స లేకుండా 18 గాయాలకు వైద్యం చేశారు. చాతి, పొట్టపై గాయాలున్నట్లు తెలిపారు. పూర్తిగా కొలుకున్న తర్వాత ఇంటికి పంపిస్తున్నామని తెలిపారు. బుధవారం శిరీషను ఆస్పత్రి నుంచి వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో దవాఖాన యాజమాన్యం చప్పిడి సుభాన్రెడ్డి, రాజవర్థన్రెడ్డి, రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.