జూబ్లీహిల్స్ : ప్రజలకు పారిశుధ్య సమస్యలు లేకుండా చూడాలని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అధికారులకు సూచించారు. సోమవారం రహ్మత్నగర్ డివిజన్ కార్మికనగర్లో కొత్తగా ఏర్పాటుచేసిన సెకెండరీ కలెక్షన్ ట్రాన్స్ఫర్ పాయింట్ను కార్పొరేటర్ సీఎన్ రెడ్డితో కలిసి పరిశీలించారు.
స్వచ్ఛ రిక్షాలతో సేకరిస్తున్న చెత్తను ఆయా వార్డులలో ఏర్పాటుచేస్తున్న కంప్రెషర్ యూనిట్లలో రవాణాకు అనుకూలంగా చేసి వేగంగా డంపింగ్ యార్డులకు తరలించనున్నట్లు అధికారులు వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ ఎ.రమేష్, ఏఎంఓహెచ్ డాక్టర్ బిందు భార్గవి, శానిటరీ సూపర్వైజర్ విజయ్ తదితరులు పాల్గొన్నారు.