మహబూబ్నగర్, జనవరి 3 : సావిత్రిబాయి ఫూలే ను మహిళలు ఆదర్శంగా తీసుకోవాలని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. సోమవారం మ హబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో సావిత్రిబాయిఫూలే చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం క్లాక్టవర్ వద్ద ఏర్పాటు చేసిన సావిత్రిబా యి ఫూలే విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహిళలకు సావిత్రిబాయి ఫూలే దిక్సూచి అని పేర్కొన్నారు. మహిళలు చదువుకుంటేనే అరాచకాలు రూపుమాపొచ్చన్న ఉద్దేశంతో జ్యోతిభా ఫూలే తన భార్య సావిత్రిబాయిఫూలేను మొదటి ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. మహిళలు చదువుకుంటే కుటుంబం ఉన్నతస్థాయికి చేరుకుంటుందన్నారు. ఆమె స్ఫూర్తితోనే అంబేద్కర్ రిజర్వేషన్లు కల్పించారన్నారు. ఫూలే ఆదర్శంగా రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి గురుకులాలను స్థాపించిందన్నారు. బడుగు, బలహీన వర్గాల వారికి విదేశీ విద్య కోసం స్కాలర్షిప్ అందిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ము న్సిపల్ చైర్మన్ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటి గణేశ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్గౌడ్, రైతుబం ధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, రాందాస్, ఫూలే, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
మంత్రికి శుభాకాంక్షలు
మహబూబ్నగర్ రూరల్, జనవరి 3 : మంత్రి శ్రీనివాస్గౌడ్కు సర్పంచులు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్గౌడ్, మహబూబ్నగర్ రూరల్ సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు.