మెహిదీపట్నం : కార్తీక పౌర్ణమి (డిప్కి పున్నం) ని పురస్కరించుకుని చారిత్రాత్మక లంగర్హౌస సంగం రామాలయంలో జరుగుతున్న జాతర శనివారం రెండో రోజూ కొనసాగింది. తెల్లవారుజామున మఠాధిపతి రాహుల్దాస్ బాబా ఆధ్వర్యంలో రామాలయంలో కార్తీక పూజలు నిర్వహించారు.
ప్రతి ఏడాది సంగంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని జరిగే జాతరను విజయవంతంగా నిర్వహించడంలో స్థానికుల సహాయసహకారాలు మరవలేనివని సంగం మఠాధిపతి రాహుల్దాస్ బాబా తెలిపారు. పార్టీలకు అతీతంగా నాయకులు సంగం రామాలయంలో విగ్రహాల ఊరేగింపు, పూజలలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు.