పల్లెల్లో ముందస్తుగానే సంబురాలు కనిపిస్తున్నాయి. పంట పెట్టుబడి సాయం రూ.50వేలకోట్లకు చేరువైన నేపథ్యంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆదివారం మహిళలు ఇండ్ల ముంగిట, రైతువేదికల ఆవరణలో పథకం, ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖచిత్రాలను ముగ్గుల రూపంలో ఉత్సవాలు నిర్వహించారు. పంట చేలల్లో కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లతో జై కేసీఆర్..జై టీఆర్ఎస్..జై రైతుబంధు అంటూ నినదించారు. రైతులతోపాటు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
రైతుబంధు సంబురాలు ఆదివారం అంబరాన్నంటాయి.. పల్లెల్లో, పట్టణాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు ఉత్సాహంగా పాలుపంచుకుంటున్నారు.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు చేస్తున్నారు.. ఆయా గ్రామాల్లో రంగవల్లుల పోటీల్లో మహిళలు పాల్గొనగా ప్రజాప్రతినిధులు బహుమతులు ప్రదానం చేశారు. పంట ఉత్పత్తులతో జై రైతుబంధు, జైజై కేసీఆర్ అని అక్షరమాలను పేర్చి పలువురిని ఆకట్టుకున్నారు.. వారోత్సవాల్లో భాగంగా పలువురు ఎమ్మెల్యేలు ట్రాక్టర్లు, ఎడ్లబండ్లపై ఊరేగింపు నిర్వహించి రైతులను ఉత్సాహపరిచారు.. మరికొన్ని చోట్ల ఉత్తమ రైతులను సన్మానించారు. – నెట్వర్క్, నమస్తే తెలంగాణ