బేగంపేట్ : రోడ్డుకు ఇరువైపుల ఫుట్పాత్లపై వెలసిన అక్రమ వ్యాపారాలను తొలగించాలని హైకోర్టు ఆదేశాలతో బేగంపేట్ సర్కిల్ టౌన్ప్లానింగ్ అధికారులు ఫుట్పాత్పై అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించారు. శుక్రవారం బేగంపేట్ డివిజన్లోని షాపర్స్టాప్ నుంచి మొదలుకోని శ్యాంలాల్ బిల్డింగ్ వరకు ఫుట్పాత్లపై ఇరువైపుల వెలసిన పలు రకాల వ్యాపారాలు నిర్వహించే డబ్బాలను, కట్టడాలను, రేకుల షెడ్డులు ఇందులో చాయ్, టిఫిన్ సెంటర్లు, జ్యూస్ సెంటర్స్ ఇతర వ్యాపారాలను కొనసాగిస్తున్న డబ్బాలను టౌన్ప్లానింగ్ సిబ్బంది జేసీబీలతో పూర్తిగ తొలగించారు.
టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి మహేందర్ ఆధ్వర్యంలో ఈ ఫుట్పాత్ ఆక్రమణలు తొలగించారు. ఈ సంధర్భంగా సెక్షన్ అధికారి మహేందర్ మాట్లాడుతూ…ఫుట్పాత్లపై నిబంధనలకు విరుద్ధంగా వెలసిన అక్రమ వ్యాపారాలు, నిర్మాణాలను తొలగించాలనే హైకోర్టు ఆదేశాల మేరకు ఈ తొలగింపు చేపట్టినట్టు ఆయన వెల్లడించారు.
ముషీరాబాద్ లో …
చిక్కడపల్లి, గోల్కొండ చౌరస్తా ప్రధాన మార్గంలో పుట్ పాత్ ఆక్రమణలను జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు శుక్రవారం తొలగించారు. సర్కిల్ -15 టౌన్ ప్లానింగ్ ఏసీపీ పావని ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది పుట్ పాత్ లను ఆక్రమించి ఏర్పాటు చేసిన దుకాణాలు, డబ్బాలు, నిర్మాణాలను జేసీబీ సహాయంతో తొలగించారు.
చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్ , గోల్కొండ చౌరస్తా ప్రధాన రోడ్డుకు ఇరువైపులా పుట్ పాత్ ఆక్రమణలను పోలీసు బందోబస్తు నడుమ తొలగించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారులు దేవేందర్ , రాందాస్, సిబ్బంది జగన్ , అనిల్ , రాజయ్య తదితరులు పాల్గొన్నారు.