బంజారాహిల్స్ : రాష్ట్రంలోని రైతులు పండించే వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనుగోలు చేయాల్సిందే అనే డిమాండ్తో శుక్రవారం చేపట్టిన రైతు ధర్నాలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంనుంచి పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలిరావాలని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కోరారు.
గురువారం జూబ్లీహిల్స్లోని తన క్యాంపు కార్యాలయంలో అన్ని డివిజన్లకు చెందిన టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్పొరేటర్లతో సమావేశమయిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇందిరా పార్కులోని ధర్నాచౌ క్వద్ద రైతు ధర్నా కార్య క్రమానికి అన్ని డివిజన్లనుంచి కార్యకర్తలు రావాలని కోరారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు రాష్ట్రంలోని బీజేపీ నాయకులు ఆడుతున్న అబద్దాలను ప్రజలకు వివరించేందుకు రైతు ధర్నాలు నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే మాగంటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సీఎన్.రెడ్డి, దేదీప్యరావు, రాజ్కుమార్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.