జడ్చర్ల రూరల్, జనవరి 6 : ఊరూరా రైతుబం ధు సంబురాలు ఉత్సాహంగా కొనసాగుతున్నా యి. పల్లెల్లో ఎడ్లబండ్ల ఊరేగింపులు, మహిళలకు ముగ్గుల పోటీలు.. విద్యార్థులకు వివిధరకాల పో టీలు నిర్వహిస్తుండడంతో పండుగ వాతావరణం నెలకొన్నది. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా గురువారం జడ్చర్ల మండలంలోని నెక్కొండ, గంగాపూర్, కోడ్గల్, లింగంపేట, నసర్లాబాద్, ఆలూర్, పోలేపల్లి, మాచారం, బూర్గుపల్లి, పెద్దఆదిరాల, మల్లెబోయిన్పల్లి తదితర గ్రామాల్లో ఎడ్లబండ్ల ఊరేగింపు నిర్వహించారు. కోడ్గల్లో జెడ్పీ వైస్చైర్మన్ యాదయ్య రైతులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, డైరెక్టర్ శ్రీను, టీఆర్ఎస్ మం డల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, సర్పంచుల సం ఘం రాష్ట్ర కార్యదర్శి ప్రణీల్చందర్, గోవర్ధన్రెడ్డి, మాజీ ఎంపీటీసీ రాములు, సలోమి, సర్పంచ్ ఆంజనేయులు, ఉపసర్పంచ్ రాజు, యూత్ అధ్యక్షుడు వీరేశ్, పాండు, శ్రీను, పశువైద్యాకారి శ్రావ ణి, రఘుకుమార్, ఏపీఎం మాల్యానాయక్, గం గాపూర్ గోపాల్, విజయ్ పాల్గొన్నారు.
రైతుల ఆత్మబంధువు సీఎం కేసీఆర్
రాజాపూర్, జనవరి 6 : రైతుల ఆత్మబంధువు ముఖ్యమంత్రి కేసీఆర్ అని డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహులు అన్నారు. గురువారం మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో రైతుబంధు సమితి ఆధ్వర్యంలో విద్యార్థులకు ముగ్గులు, వ్యా సరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో తాసిల్దార్ శంకర్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, ఎంపీడీవో లక్ష్మీదేవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, హెచ్ఎం ఆనంద్కుమార్, రమేశ్నాయక్, యాదగిరి, శ్రీనివాస్నాయ క్, తిరుపతయ్య, శ్రీకృష్ణ పాల్గొన్నారు.
రైతుల అభ్యున్నతికి కృషి
బాలానగర్, జనవరి 6 : ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల అభ్యున్నతికి అహర్నిశలు కృషి చేస్తున్నారని రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కమ్మదనం గోపాల్రెడ్డి అన్నారు. మండలంలోని చిన్నరేవల్లిలో రైతుబంధు వారోత్సవాలను ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మి, టీఆర్ఎస్ నాయకుడు చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
అన్నదాత సంక్షేమమే లక్ష్యం
కోయిలకొండ, జనవరి 6 : అన్నదాత సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తున్నారని జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి అన్నారు. మండలంలోని చంద్రాసుపల్లి, కోయిలకొండ గ్రా మాల్లో విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీ లు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదా నం చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ మల్లయ్యయాదవ్, సింగిల్విం డో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, సర్పంచ్ గోపాల్, ఎంపీటీసీ నిరూపమరాణి, రాజవర్ధన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మూసాపేట మండలంలో..
మూసాపేట, జనవరి 6 : మండలకేంద్రంతోపాటు నిజాలాపూర్, జానంపేట గ్రామాల్లో రైతుబంధు సంబురాలను వైభవంగా నిర్వహించారు. పోల్కంపల్లిలో మహిళలకు ముగ్గుల పోటీలు, వి ద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, ఏవో రాజేందర్రెడ్డి, సర్పంచ్ శ్రీకాంత్రెడ్డి, గడ్డమీది సత్యమ్మ, శ్రీనివాసులు, చందశేఖర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు భాస్కర్గౌడ్, టీఆర్ఎస్ బీసీసెల్ అధ్యక్షుడు గూపని కొండయ్య తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, జనవరి 6 : రైతుబంధు వారోత్సవా ల్లో భాగంగా మండలంలోని బోయిన్పల్లిలో మొ క్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రభుత్వం రైతు ల సంక్షేమానికి అమలు చేస్తున్న పథకాలను గ్రా మస్తులకు వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ నారాయణరెడ్డి, ఏఈవో సాయికృష్ణ, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ నర్సింహారెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, జనవరి 6 : మండలకేంద్రంతోపా టు వివిధ గ్రామాల్లో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం, ఉపన్యాస పోటీలు నిర్వహించారు. విజేతలకు 10వ తేదీన మంత్రి శ్రీనివాస్గౌడ్ చేతులమీదుగా బహుమతులను ప్రదానం చేయనున్నట్లు రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాజుయాదవ్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ బాలరాజు, ఎంపీడీవో ధనుంజయగౌడ్, ఎంఈ వో రాజునాయక్, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్లు కొండా లక్ష్మయ్య, రమణారెడ్డి, కోఆప్షన్ సభ్యుడు మన్నాన్, ఉపసర్పంచ్ గంగాపూరి, సత్యం, మోహన్ పాల్గొన్నారు.
మహ్మదాబాద్ మండలంలో..
మహ్మదాబాద్, జనవరి 6 : రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా మహ్మదాబాద్, నంచర్ల, జూలపల్లి ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీల్లో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు అధికారులతో కలిసి ప్రజాప్రతినిధులు బహుమతులను ప్రదానం చేశారు. కా ర్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భిక్షపతి, ఏఈవోలు నిఖిత, మాధురి, పవన్ తదితరులు పాల్గొన్నారు.