బాలానగర్, జనవరి 8: ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులకు అన్నివిధాలా అండగా నిలిచి రైతుబాంధవుడిగా మారారని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా బాలానగర్ మండలం పెద్దాయపల్లిలో నిర్వహించిన ముగ్గుల పోటీలకు హాజరై తిలకించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. రైతుబంధు పథకం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి రైతుకూ పంట పెట్టుబడి సాయం అందించి అండగా ని లిచారన్నారు. దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలు చేస్తూ అన్నదాతల్లో ఆనందం నింపుతున్నట్లు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డితోపాటు ఉత్తమ రైతులను గ్రామ సర్పంచ్ శంకర్ ఘనంగా సన్మానించారు. అలాగే పెద్దాయపల్లి చౌరస్తాలో నిర్మిస్తున్న సంత్ సేవాలాల్, మరియమ్మ ఆలయం, ఎస్టీ కమ్యూనిటీహాల్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. సూరారం గ్రామానికి చెందిన రైతు భిక్షపతి మృతి చెందగా, అతడి భార్య జయమ్మకు మంజూరైన రూ.5లక్షల రైతుబీమా చెక్కును అందజేశారు. కార్యక్రమాల్లో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర రూరల్, జనవరి 8 : గ్రామగ్రామానా రైతుబంధు వారోత్సవాలు ఉత్సాహంగా కొనసాగుతున్నా యి. దేవరకద్ర మండలంలోని కౌకుంట్ల, డోకూర్, లక్ష్మీపల్లి, చౌదర్పల్లి, హజిలాపూర్తోపాటు చిన్నచింతకుంట మండలంలోని లాల్కోట, ఉంద్యాల, ముచ్చింతల గ్రా మాల్లో సంబురాలు మిన్నంటాయి. లాల్కోటలో ము ఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అలాగే మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరి, పీఏసీసీఎస్ చైర్మన్ సురేందర్రెడ్డి, నరేందర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు కరుణాకర్రెడ్డి, కురుమూర్తి ఆలయ చైర్మన్ ప్రతాప్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోటరాము తదితరులు పాల్గొన్నారు.
భూత్పూర్ మండలంలో..
భూత్పూర్, జనవరి 8 : మండలంలోని వివిధ గ్రామాల్లో రైతుబంధు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం పంటసాగు పెట్టుబడి సాయం రూ.50వేలకోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ శేరిపల్లి(హెచ్) గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహాగౌడ్, మున్సిపల్ చైర్మన్ సత్తూర్ బస్వరాజ్గౌడ్, సింగిల్విండో చైర్మన్ అశోక్రెడ్డి, సర్పంచ్ శేఖర్, టీఆర్ఎస్ నాయకులు సత్తూర్ నారాయణగౌడ్, సాయిలు, మనెమోని సత్యనారాయణ, వెంకట్రాములు, వెంకటేశ్, దేవేందర్, రాములు పాల్గొన్నారు.
మూసాపేట మండలంలో..
మూసాపేట, జనవరి 8 : రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా మండలంలోని తిమ్మాపూర్ తదితర గ్రామాల్లో రైతులు సంబురాలు జరుపుకొన్నారు. తిమ్మాపూర్లో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనర్సింహయాదవ్, శివరాములు, మల్లన్నయాదవ్, రెడ్డిరాజు, యాసిన్, ఆంజనేయులు, నాగరాజు, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
హన్వాడ మండలంలో..
హన్వాడ, జనవరి 8 : రైతుబంధు వారోత్సవాల్లో భా గంగా మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ విజయనిర్మల మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేసి పథకాలను అమలు చేస్తున్నదన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, జనవరి 8 : మండలంలోని సంగనోనిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే రా జేందర్రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం దేశానికే ఆదర్శమన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు శ్రీనివాస్రెడ్డి, మండల కన్వీనర్ మల్లయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బీ.కృష్ణయ్య, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, వింజమూర్ సర్పంచ్ నారాయణరెడ్డి, కోప్షన్ సభ్యుడు టీవీ ఖాజా, టీఆర్ఎస్ నాయకులు రా జేంద్రప్రసాద్గౌడ్, భీంరెడ్డి, బుచ్చిరెడ్డి, అంకిళ్ల రవి, రాజవర్ధన్రెడ్డి, నారాయణగౌడ్, మొగులయ్య, నజీమ్, వాసు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, జనవరి 8 : మండలంలోని వస్పుల్ గ్రామం లో రైతుబంధు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రైతువేదిక ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం రైతులతో కలిసి కేక్ కట్ చేసి సం బురాలు జరుపుకొన్నారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్యాంసుందర్రెడ్డి, జెడ్పీటీసీ శశిరేఖ, సర్పంచ్ మధుసూదన్రెడ్డి, ఎంపీటీసీ నర్సింహ, ఏఈవో శివనీల, నాయకులు బాలు, నర్సింహులు, జైపాల్రెడ్డి, భద్రయ్య, బీరయ్య, ఈశ్వర్, నవీనాచారి పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, జనవరి 8 : మండలకేంద్రంతోపాటు తి ర్మలాపూర్, ఈద్గాన్పల్లి, రంగారెడ్డిగూడ గ్రామాల్లోని రై తువేదికల్లో రైతుబంధు వారోత్సవాలను ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ రైతులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రంగారెడ్డిగూడ రైతుబం ధు సమితి అధ్యక్షుడు కుమార్రెడ్డి, ఏవో నరేందర్, ఏఈ వో దీపిక, మేఘనాథ్, ఆంజనేయులు, కావలి రాము లు, రాములుగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
నవాబ్పేట మండలంలో..
నవాబ్పేట, జనవరి 8 : రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా శనివారం టీఆర్ఎస్ మండల నాయకులు, ప్ర జాప్రతినిధులు చౌడూర్, రంగంపల్లి గ్రామాల రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ మాడెమోని నర్సింహులు వ్యవసాయ పొలాలకు వెళ్లి సాగు చేస్తున్న పంటల వివరాలు, రైతుబంధు డబ్బులపై ఆరా తీశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న రైతుబంధుతో తాము సంతోషంగా పంటలు సాగు చేసుకుంటున్నామని రైతులు వివరించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ మధుసూదన్రెడ్డి, ఎం పీటీసీ గోపీకృష్ణ, నాయకులు లింబ్యానాయక్, చెన్న య్య, చిన్నయ్య, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్ల మండలంలో..
జడ్చర్ల రూరల్, జనవరి 8 : రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా మండలంలోని ఆలూర్, నసుర్లాబాద్, బూర్గుపల్లి, కోడ్గల్, లింగంపేట, పెద్దఆదిరాల, పోలేపల్లి, మాచారం తదితర గ్రామాల్లో మహిళలకు ముగ్గుల పోటీ లు నిర్వహించారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ సుకన్యారెడ్డి, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ మండలంలో..
మహబూబ్నగర్ రూరల్. జనవరి 8 : రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా మండలంలోని ఓబ్లాయిపల్లిలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలకు ఎంపీపీ సుధాశ్రీ హాజరై తిలకించారు. కార్యక్రమంలో సర్పంచ్ చంద్రకళావెంకటస్వామి, ఏఈవో కృష్ణ, నరేం దర్రెడ్డి, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.