గోల్నాక : నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పాదయాత్రలు చేపడుతూ స్థానిక సమస్యల పరిష్కారానికి సత్వరమే చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు.
మంగళవారం అంబర్పేట డివిజన్లోని నరేంద్రనగర్లో స్థానిక కార్పొరేటర్ ఇ.విజయ్కుమార్గౌడ్, పలు శాఖల అధికారులతో కలసి ఆయన క్షేత్రస్థాయిలో పాదయాత్ర నిర్వహించారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. స్థానికులు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం బస్తీల్లో పర్యటిస్తూ తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఆరా తీసారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ…నియోజకవర్గ వ్యాప్తంగా మౌలిక వసుతుల కల్పనకు అధిక ప్రాధన్యతనిస్తున్నామన్నారు.
రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ, మంచినీటి, వరదనీటి పైప్లైన్ల ఏర్పాటు పనులను ముమ్మరంగా చేపడుతున్నామన్నా రు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు కుశాల్, బస్తీ వాసులు ఉమేష్, మధు, వేణు, శశిధర్, కృష్ణాచారి, నరసింహ, కిరణ్తో పాటు డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సిద్ధార్థ్ ముదిరాజ్, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.