ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ సంయుక్తారెడ్డి (88) అనారోగ్యంతో కన్నుమూశారు. 1933లో నల్లగొండ జిల్లాలో జన్మించిన సంయుక్తారెడ్డి ఆర్ట్స్కళాశాలలో 1957లో ఎంఏ పూర్తి చేశారు. 1959లో ఓయూలో అధ్యాపకురాలిగా చేరి, కోఠి మహిళా కళాశాలలో విధులు నిర్వర్తించారు.
బాల్యవివాహాలను అడ్డుకుని, ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు విద్యార్థినులను ప్రోత్సహించారు. 1993లో పదవీ విరమణ చేసే వరకు ఆమె కోఠి మహిళా కళాశాలలోనే సేవలందించారు. ఆమె మృతి పట్ల ఓయూ తెలుగు విభాగం హెడ్ ప్రొఫెసర్ సూర్యధనుంజయ, ప్రొఫెసర్ నిత్యానందరావు, ప్రొఫెసర్ కాశీం తదితరులు నివాళులు అర్పించారు.