అంబర్పేట : అంబర్పేట నియోజకవర్గంలోని అన్ని పార్కులను సకల సౌకర్యాలతో సుందరీకరిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలే రు వెంకటేశ్ తెలిపారు. అంబర్పేట డివిజన్లోని అనంతరామ్నగర్ కాలనీలో రూ.22 లక్షలతో చేపట్టిన పార్కు సుందరీ కరణ పనులకు కార్పొరేటర్లు ఇ.విజయ్కుమార్గౌడ్, బి.పద్మవెంకటరెడ్డి, మాజీ కార్పొరేటర్ కె.పద్మావతితో కలిసి మంగళ వారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని కాచిగూడ డివిజన్లో గల విక్రమ్నగర్ పార్కు, హౌసింగ్ బోర్డు కాలనీ పార్కు, తిలక్నగర్, టీఆర్టీ, రామకృష్ణనగర్, తులసీనగర్ కాలనీ, ఇంద్రప్రస్ధకాలనీ, వైభవ్నగర్ కాలనీ, ఎస్బీఐ, ఎస్బీహెచ్ కాలనీ పార్కులను అందంగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.
రూ.3 కోట్లు వెచ్చించి పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాలనీవాసులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించా లనే ఉద్దేశంతో వీటిని అందంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. త్వరలోనే అన్ని పార్కుల్లో అభివృద్ధి పనులు మొదల వుతాయని చెప్పారు.
ఇప్పటికే కొన్నింటిలో పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈలు సుధాకర్, సంతోష్, ఏఈ శ్వేత, ఎలక్టికల్ ఏఈ సౌమ్య, వాటర్వర్క్ మేనేజర్ కుషాల్, ఏఎంఓహెచ్ జ్యోతిభాయి, కాలనీవాసులు కృష్ణారెడ్డి, ఎరబోలు నర్సింహారెడ్డి, గోపాల్గౌడ్, అశోక్కుమార్ తదితరులు పాల్గొన్నారు.