బంజారాహిల్స్ : జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్లోని వినాయక్నగర్ బస్తీని అనుకుని ఉన్న ప్రభుత్వ స్థలంలో యథేచ్చగా సాగుతున్న అక్రమ డంపింగ్లను అడ్డుకోవాలని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్థానిక సెక్టార్ ఎస్ఐ రవిరాజ్ను ఆదేశించారు.
గురువారం వినాయక్నగర్, బండారు బాల్రెడ్డినగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఎమ్మెల్యేకు స్థానిక బస్తీనేతలు అక్రమ డంపింగ్లపై ఫిర్యాదు చేశారు. వినాయక్నగర్కు చెందిన అయ్యప్ప ఆలయంతో పాటు ఇతర ఆలయాలకు దారిలేకుండా స్థానిక హకీంబాబా దర్గా కమిటీకి చెందిన కొంతమంది ఈ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు భారీగా మట్టిని తీసుకువచ్చి డంపింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై పోలీసులతో పాటు ఆర్కియాలజీ విభాగం అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. దీనికి స్పందించిన ఎమ్మెల్యే దానం నాగేందర్ అక్కడే ఉన్న ఎస్ఐ రవిరాజ్ను పిలిచి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బస్తీ కమిటీ నేతలు కిరణ్, రాములు తదితరులు పాల్గొన్నారు.