జూబ్లీహిల్స్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేదలు ఆనందంగా పెండ్లి వేడుకలు జరుపుకుంటున్నారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు.
గతంలో ఆడబిడ్డల పెండ్లీ చేయాలంటే తల్లిదండ్రులకు భారంగా ఉండేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ వారి ఆవేదనను గుర్తించి మానవీయకోణంలో ఈ పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. ఆదివారం యూసుఫ్గూడ డివిజన్లో కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు రూ.19 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు.
డివిజన్లోని వెంకటగిరి, హైలం కాలనీ, లక్ష్మీనరసింహనగర్, యూసుఫ్గూడ బస్తీలకు చెందిన 19 మంది లబ్దిదారులకు ఒక్కొక్కరికీ రూ.1 లక్ష 116 చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రాజ్కుమార్ పటేల్, ఖైరతాబాద్..షేక్పేట్ మండలాల వీఆర్ఓలు రాహుల్, స్వామిలతో పాటు పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.