పహాడీషరీఫ్ : పర్యావరణ సమతుల్యతకోసం వృక్ష సంపదను పెంచి భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలను నాటాలని రాచకొండ సి.పి మహేశ్ భగవత్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి అన్నారు. హైదరాబాద్కు చెందిన ప్రముఖ మైక్రోసాఫ్ట్ మల్టీ నేషనల్ కంపెనీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక పోలీస్ స్టేషన్ ఆవరణలో200 మొక్కలను నాటే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన మహేశ్భగవత్ మొక్కలను నాటి ఎరువు పోసి నీళ్లు పోశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మొక్కలు నాటేందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీ స్వచ్ఛందగా ముందుకు రావడం అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా మామిడి, పనస, నేరేడు, సీతాఫలం, ఆయుర్వేదం సంబంధించిన వివిధ రకాల మొక్కలను నాటారు. రాబోయే రెండు, మూడు సంవత్సరాలో అవి ఏపుగా పెరిగి పండ్లను, నీడను ఇస్తాయని, పోలీస్ స్టేషన్కు ఆకర్షనీయంగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు వెంకటేశ్వర్లు, భాస్కర్, డీఐ అర్జునయ్య, ఎస్సైలు హయ్యూం, పాండు, ప్రభులింగం తదితరులు పాల్గొన్నారు.