గోల్నాక : నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులకు సూచించారు. శుక్రవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
నియోజకవర్గంలోని అంబర్పేట, గోల్నాక, బాగ్అంబర్పేట, నల్లకుంట, కాచిగూడ డివిజన్లలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. రహదారుల అభివృద్ధి, డివైడర్ల సుందరీ కరణ, పార్కుల అభివృద్ధితో పాటు పెండింగ్లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
దీంతో పాటు కొత్తగా ఏఏ ప్రాంతాల్లో రహదారులు ఏర్పాటు చేయాలో వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవా లన్నారు.
నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, సుధాకర్, అధికారులు సువర్ణ తదితరులు పాల్గొన్నారు.