చిక్కడపల్లి : ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. టీఆర్ఎస్ నాయకుడు, జై యువ సేన అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం జవహర్నగర్ కమ్యూనిటీ హాల్లో దుర్గామాత శాంతి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈకార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావన కలిగి ఉండాలని అన్నారు. లోక కళ్యాణం కోసం, దేశ, రాష్ట్ర సంక్షేమం కోసం శాంతి పూజ నిర్వహించిన నిర్వాహకులను ఎమ్మెల్యే అభినంధించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముఠా పద్మా, ముఠా నరేశ్, ముఠా జైసింహ, పార్టీ డివిజన్ అధ్యక్షుడు రాకేశ్, గడ్డమీది శ్రీనివాస్, పరుశురామ్, ముఖుంద్రెడ్డి , సుధాకర్, చాణిక్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.