శేరిలింగంపల్లి : యాంత్రిక జీవనానికి అలవాటు పడిన నగరవాసులకు కాలనీల్లో ఆహ్లాదకర వాతవరణాన్ని అందించడంతో పార్కులు ఎంతగానో దోహాద పడుతాయని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఆదివారం నలగండ్ల లక్ష్మీవిహార్ ఫేజ్-1 కాలనీలో నూతనంగా ఏర్పాటుచేసిన పార్కును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ కాలనీలలో ప్రశాంత వాతవారణం అందించడంలో పార్కులు ఉపకరిస్తాయన్నారు.
నగరవాసులకు ఆహ్లాదాన్ని అందించే విడుదులుగా పార్కులు మారుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో తమవంతు పాత్రను పోషించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మంత్రిప్రగడ సత్యనారాయణ, లక్ష్మీవిహార్ ఫేజ్-1 కాలనీ అధ్యక్షుడు భూషణ్, ఉపాధ్యక్షుడు భువనేశ్వర ప్రసాద్, జనరల్ సెక్రటరీ మంత్రవాది తదితరులు పాల్గొన్నారు.