కాచిగూడ : షాపింగ్ కాంప్లేక్స్ ముందు పార్క్ చేసిన ద్విచక్రవాహనం మాయమయిన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్సై రాజేంద్రన్ తెలిపిన వివరాల ప్రకారం మురాద్నగర్ ప్రాంతానికి చెందిన మహ్మాద్ అబ్దుల్ బరి (30) ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
సెప్టెంబర్ 28న కాచిగూడలోని విఎన్ఆర్ కాంప్లేక్స్ ముందు టీఎస్ 13 ఈఈ 7407 హీరోహోండా ద్విచక్రవాహనాన్ని పార్కింగ్ చేసి పని చూసుకుని వచ్చేసరికి వాహనం మాయమైంది.చుట్టు పక్కల, ఇతర ప్రాంతాల్లో వెతికినా ఆచూకి లభించలేదు. దీంతో అబ్దుల్ బరి కాచిగూడ పోలీస్ట్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.