కాచిగూడ : పర్యావరణ పరిరక్షణ కోసం కాగితం పతంగులనే ఉపయోగించి, పకృతిని కాపాడాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని టీఆర్ఎస్ నాయకుడు బండసూరి ఆధ్వర్యంలో చెప్పల్బజార్లో శుక్రవారం పతంగుల పండుగ నిర్వహించారు.
ఈ సందర్శంగా స్థానికులతో కలిసి ఎమ్మెల్యే కాలేరు చిన్నారులకు పతంగులను పంపిణీ చేసి, అనంతరం స్థానికులతో కలిసి పతంగులు ఎగురవేసి సందడి చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలకు పండుగలు ప్రతీకగా నిలుస్తాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం అన్ని పండుగలకు సీఎం కేసీఆర్ రాజకీయాలకు అతీతంగా అధిక ప్రాముఖ్యత ఇస్తున్నాడని ఆయన పేర్కొన్నారు.
పకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ప్రతి ఒక్కరూ ప్లాస్లిక్ పతంగులు, చైనా మాంజాలను వాడొద్దన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర భీష్మాదేవ్, మాజీ ప్లోర్లీడర్ దిడ్డి రాంబాబు, సునీల్బిడ్లాన్, కె.సదానంద్, దాత్రిక్ నాగేందర్బాబ్జి, బి.కృష్టాగౌడ్, బబ్లూ, విజితారెడ్డి, తుమ్మల నర్సింహ్మరెడ్డి, సాయిబాబా, రాజేశ్,బాబు తదితరులు పాల్గొన్నారు.