ట్రాక్టర్ ర్యాలీలు.. ఇండ్ల ముంగిట రంగువల్లులు.. పంట పొలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు..వెరసి ఊరూరా వేడుకలు హోరెత్తుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజాప్రతినిధులు, అధికారులు రైతు బంధు వారోత్సవాల్లో పాల్గొంటున్నారు. ఎనిమిదో విడుతలో అందిస్తున్న సాయం సంక్రాంతి కంటే ముందే తమ కుటుంబాల్లో సంతోషాలను నింపిందని రైతు కుటుంబాలు చెప్తున్నాయి. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి శుక్రవారం భువనగిరి మండలం ముత్తిరెడ్డి గూడెం, ఆలేరు పట్టణంలో నిర్వహించనున్న రైతుబంధు సంబురాల్లో పాల్గొననున్నారు.
యాదాద్రి భువనగిరి, జనవరి 6(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ట్రాక్టర్ ర్యాలీలు.. ఇండ్ల ముంగిట రంగువల్లులు.. పంట పొలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకాలు.. వెరసి ఊరూరా రైతు బంధు సంబురాలు హోరెత్తుతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు, ప్రజాప్రతినిధులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మరోవైపు వ్యవసాయ శాఖ యంత్రాంగం ఆధ్వర్యంలో రైతుబంధుపై పాఠశాలల విద్యార్థులకు పలు పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందిస్తున్నారు. ఎనిమిదో విడుతలో అందిస్తున్న సాయం సంక్రాంతి కంటే ముందే తమ కుటుంబాల్లో కొత్త కాంతులను నింపిందని రైతు కుటుంబాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. రైతు బంధు తెచ్చిన సంతోషాన్ని అందరితో పంచుకుంటున్నారు.
రైతు ఖాతాల్లో జమవుతున్న పెట్టుబడి సాయం డబ్బులతో రైతన్నల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. పెట్టుబడి కష్టం తీరిన ఆనందంతో రైతులు సంబురాలు చేసుకుంటున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నాలుగో రోజు గురువారం రైతు బంధు వారోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కరోనా కాలంలోనూ కర్షకులకు పెట్టుబడి సాయం అందించి అండగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ను జన్మజన్మలా మరువబోమంటూ పండుగ వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. కృతజ్ఞతా పూర్వకంగా.. ఎడ్లబండ్లపై ఊరేగింపులు, రంగువల్లులు, క్షీరాభిషేకాలు నిర్వహించారు. ఊరూ, వాడా, చేను, చెలక.. ఇంటి ముంగిళ్లు.. అన్నింటా సందడి నెలకొంది. రాజాపేట మండలంలోని దూది వెంకటాపురంలో రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. రామన్నపేట మండలం శోభనాద్రిపురంలో నిర్వహించిన సంబురాల్లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పాల్గొని స్వీట్లు పంపిణీ చేసి రైతులతో సంతోషాన్ని పంచుకున్నారు. యాదగిరిగుట్ట మండలం గౌరాయిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యాస రచన పోటీలు నిర్వహించారు.
నేడు జిల్లాకు మంత్రి నిరంజన్రెడ్డి
యాదాద్రి, జనవరి 6 : వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరుగనున్న ‘రైతు బంధు’ వారోత్సవాల్లో పాల్గొననున్నారు. ప్రభుత్వవిప్ గొంగిడి సునీత, డీసీసీబీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డితో కలిసి ఆలేరు పట్టణంలోని జిన్నింగ్ మిల్ కేంద్రంలో సంబురాల్లో పాల్గొంటారు. అనంతరం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారిని దర్శించుకుంటారు. భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం రైతువేదిక భవనంలో నిర్వహించనున్న ‘రైతుబంధు’వారోత్సవాల్లో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి పాల్గొంటారు.
వ్యవసాయ రంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట
ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
రామన్నపేట, జనవరి 6 : వ్యవసాయ రంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని శోభనాద్రిపురం గ్రామంలో రూ.5లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం రైతు బంధు వారోత్సవాల్లో భాగంగా రైతులతో కలిసి సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతులను శాలువాలతో సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన చేపట్టిన ఏడువందల మంది రైతుల మరణాలకు కారణమైన బీజేపీ తెలంగాణలో రైతులు, ఉద్యోగుల పట్ల కపటప్రేమను చూపిస్తున్నదని మండిపడ్డారు. ఎంపీపీ కన్నెబోయిన జ్యోతీబలరాం, సింగిల్విండో చైర్మన్ నంద్యాల భిక్షంరెడ్డి, తాసీల్దార్ ఆంజనేయులు, ఎంపీడీఓ జలేందర్రెడ్డి, వైస్ఎంపీపీ నాగటి ఉపేందర్, ఏఓ యాదగిరిరావు, ప్రిన్సిపాల్ శివకోటి, ప్రోగ్రాం నిర్వాహకురాలు పి.విజయలక్ష్మి, పీఆర్ఏఈ గాలయ్య, ఎంపీటీసీ గొరిగె నర్సింహ, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మందడి ఉదయ్రెడ్డి, నాయకులు పున్న జగన్మోహన్, బందెలరాములు, పోచబోయిన మల్లేశం, కంభంపాటి శ్రీనివాస్, మందడి శ్రీధర్రెడ్డి, పోతరాజు సాయికుమార్, ఆమేర్, రమేశ్ పాల్గొన్నారు.