నవాబ్పేట, జనవరి 7: ప్రపంచంలోని దేశాలకే తెలంగాణలోని అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఆదర్శంగా నిలుస్తున్నాయని మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మండలంలోని ఆయా గ్రామాల్లో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అంతకుముందు కొల్లూరులో రైతువేదిక, వైకుంఠధామాన్ని ప్రారంభించారు. అనంతరం లింగంపల్లి, గురుకుంటలో నిర్మించిన రైతువేదికలను ప్రారంభించారు. ఆయా గ్రామాల్లో నిర్వహించిన ముగ్గుల పోటీలను ఎంపీ, ఎమ్మెల్యే పరిశీలించారు. నవాబ్పేటలో కూరగాయల మార్కెట్ నిర్మాణానికి శంకుస్థాపన, ఫతేపూర్ మైసమ్మ ఆలయంలో పూజలు చేశారు. ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతులకు రైతుబంధు, రైతుబీమా, 24గంటల కరెంట్ తదితర పథకాలు ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. రాష్ట్రంలో బీజేపీ నాయకులు అలజడి సృష్టించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని, వారిని నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. బీజేపీ నాయకుల జూటా మాటలకు మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో సంగీత నాటక అకాడమీ చైర్మన్ బాద్మి శివకుమార్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్, మండలాధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, ఎంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవీందర్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ నర్సింహులు, వైస్ఎంపీపీ సంతోష్రెడ్డి, తాసిల్దార్ రాజేందర్రెడ్డి, ఎంపీడీవో శ్రీలత, ఏవో కృష్ణకిశోర్, మండల కోఆప్షన్ సభ్యులు తాహెర్, సర్పంచులు గోపాల్గౌడ్, సౌజన్య, లక్ష్మమ్మ, పాండురంగారెడ్డి, సత్యం, వెంకటేశ్, ఎంపీటీసీలు రాధాకృష్ణ, అనిత, తులసీరాంనాయక్, నాయకులు నాగిరెడ్డి, ప్రతాప్, పాశం గోపాల్, మెండె లక్ష్మయ్య, గండు చెన్నయ్య, కర్రోళ్ల శ్రీనివాస్, చందర్నాయక్, దేపల్లి రాములు, ఎర్రోళ్ల శ్రీను, కృష్ణగౌడ్, సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.