బంజారాహిల్స్: డా.బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ సప్లమెంటరీ పరీక్షలు (ఓల్డ్ బ్యాచ్) డిసెంబర్ 28నుంచి నిర్వహించనున్నారు. మొదటి సంవత్సరం పరీక్షలు డిసెంబర్ 28నుంచి 31వరకు, జనవరి 3నుంచి 8 వరకు రెండో సంవత్సరం , జనవరి 17నుంచి 22వరకు మూడో సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
మధ్యాహ్నం 2గంటలనుంచి 5గంటల దాకా పరీక్షలు నిర్వహించనున్నారు. ఫీజు చెల్లింపుతో పాటు ఇతర వివరాలు యూనివర్సిటీ వెబ్సైట్లో పొందవచ్చని సూచించారు. హాల్ టికెట్లను పరీక్ష తేదీకి రెండురోజుల ముందు డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు.