నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 7 : రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని ఎనిమిది విడుతలుగా విజయవం తంగా అమలు అవుతుండడంపై రైతుబంధు వారోత్సవాలు కొనసాగుతున్నాయి. జిల్లాలోని పలు మండలాలు, గ్రామాల్లో ప్రజాప్రతినిధులు, నాయకులు, రైతులు వారోత్సవాల్లో పాల్గొన్నారు. పలు గ్రామాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.
బాన్సువాడ మండలంలోని పలు గ్రామాల్లో రైతుబంధు వారోత్స వాలను నిర్వహించారు. బాన్సువాడ మండలం కొత్తబాదిలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో విద్యార్థులకు స్థానిక నాయకులు ముగ్గుల పోటీలు నిర్వహించారు.
దోమకొండలోని ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో జడ్పీటీసీ సభ్యుడు తిర్మల్గౌడ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ నర్సారెడ్డి, అధికారుల ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. విప్ గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు వారోత్సవాలను నిర్వహిస్తున్నామని నాయకులు తెలిపారు.
బీర్కూర్ మండలం బరంగేడ్గి, మల్లాపూర్, తిమ్మాపూర్, బీర్కూర్ తండా గ్రామాల్లో ఏఎంసీ చైర్మన్ అశోక్ ఆధ్వర్యంలో రైతుబంధు వారోత్సవాలను నిర్వహించారు. స్థానిక నాయకులు, రైతులు సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. అనంతరం బరంగేడ్గిలో నలుగురికి కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు.
మాచారెడ్డి, పాల్వంచ, చుక్కాపూర్ జడ్పీహెచ్ఎస్లో రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ప్రతిభ చూపిన విద్యార్థులకు జడ్పీటీసీ సభ్యుడు రాంరెడ్డి, ఇన్చార్జి ఎంపీపీ నర్సింహారెడ్డి బహుమతులు ప్రదానం చేశారు. బీర్కూర్లోని జడ్పీహెచ్ఎస్లో ఎస్ఎంసీ చైర్మన్ రాజు ఆధ్వర్యం లో విద్యార్థినులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు.
బాన్సువాడ మండలంలోని తాడ్కోల్, తిర్మలాపూర్, కొత్తబాది గ్రామాల్లో నిర్వహించిన వారోత్సవాల్లో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు దుద్దాల అంజిరెడ్డి పాల్గొన్నారు. రైతులతో కలిసి సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. బీబీపేట్ మండలంలోని ప్రభుత్వ బాలుర, బాలికల ఉన్నత పాఠశాల్లో విద్యార్థులకు వ్యాసరచన, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. ప్రతిభ చూపిన 12 మంది విద్యార్థులకు విప్ గంప గోవర్ధన్ అందజేసిన డిక్షనరీలు, పెయింటింగ్ బుక్కులను స్థానిక ప్రజాప్రతినిధులు అందజేశారు.
కామారెడ్డి మండలంలోని గర్గుల్, చిన్నమల్లారెడ్డి, గూడెం తదితర గ్రామాల్లో ఎంపీపీ ఆంజనేయులు, జడ్పీటీసీ రమాదేవి, సర్పంచుల ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
నస్రుల్లాబాద్ మండలం సంగెం గ్రామంలో రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం చిత్రపటాలకు ఎంపీపీ విఠల్ క్షీరాభిషేకం చేశారు.
గాంధారిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వ్యవసాయ శాఖ అధికారులు విద్యార్థులకు వ్యాసరచన, ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు మండల వ్యవసాయాధికారి యాదగిరి బహుమతులను అందజేశారు.
లింగంపేటలోని సహకార సంఘం కార్యాలయం వద్ద రైతు బంధు వారోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎంపీపీ గరీబున్నీసా బేగం క్షీరాభిషేకం చేశారు.
తాడ్వాయి మండలంలోని క్రిష్ణాజివాడి, ఎర్రాపహాడ్, సంతాయి పేట గ్రామాల్లో రైతుబంధు వారోత్సవాల్లో భాగంగా టీఆర్ఎస్ మండల నాయకులు, రైతులు సంబురాలు నిర్వహించారు. మండలంలోని క్రిష్ణాజివాడి రైతు వేదికలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
రామారెడ్డి మండలం రెడ్డిపేట్ గ్రామంలో ఉన్న ఉన్నత పాఠశాలలో సర్పంచ్ సునంద ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కామారెడ్డి పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల, దేవునిపల్లి జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ప్రథమ, ద్వితీయ, తృతీయస్థానాలు సాధించిన వారికి డిక్షనరీలను మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఇందుప్రియ, కామారెడ్డి పట్టణ టీఆర్ఎస్ అధ్యక్షుడు జూకంటి ప్రభాకర్రెడ్డి అందజేశారు.
బిచ్కుంద, పుల్కల్ గ్రామాల్లో రైతుబంధు వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన, ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
రైతులకు ఆర్థికంగా అండగా ఉండేందుకు రైతుబంధు
ప్రతి రైతుకూ అండగా ఉండేందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్నదని ఎల్లారెడ్డి బల్దియా చైర్మన్ సత్యం అన్నారు. ఎల్లారెడ్డి మండలంలోని ఆజామాబాద్ సొసైటీలో శుక్రవారం ఏర్పాటు చేసిన రైతుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం ప్రతిరోజూ ఆలోచిస్తారని అన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఉషాగౌడ్, నాయకులు జలంధర్రెడ్డి, సాయిలు, మహ్మద్ అలీ, నర్సింహారెడ్డి, దుర్గయ్య, రైతులు రాజు, గంగారెడ్డి, మల్లారెడ్డి, కిష్టయ్య, సాయ న్న, సాయిలు తదితరులు పాల్గొన్నారు.