ఊట్కూర్, జనవరి 6 : మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం మండలంలోని నిడుగుర్తి, ఎడవెల్లి, ప గిడిమర్రి, బిజ్వారం తదితర గ్రామాల్లో గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో రై తుబంధు సంబురాలను ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. అధికారులు, రైతులు, విద్యార్థులు పాల్గొని రంగురంగుల ముగ్గులతో ఆకట్టుకున్నారు. గ్రామాల్లో ఎడ్లబండ్ల ర్యాలీ నిర్వహించారు. ఏవో గణేశ్రెడ్డి, ఎంఈవో వెంకటయ్య మా ట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం ఈ సీజన్లో రైతులకు ఎంతగానో మేలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచులు యశోదమ్మ, శిరీష, సులోచన, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మారెడ్డి, మాజీ సర్పంచ్ విజయభాస్కర్రెడ్డి, ఏఈవోలు సాగర్, చరణ్, కల్పన తది తరులు పాల్గొన్నారు.
మాగనూర్లో..
మండలంలోని వడ్వాట్లో గురువారం రైతుబంధు సం బురాలు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సర్పంచ్ నర్సింహులు, ఏవో ధనూష పాల్గొని విద్యార్థులకు వ్యాస రచన, ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఏఈవోలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నారాయణపేట రూరల్..
మండలంలోని ఊటకుంట తండాలో గురువారం రైతుబంధు సంబురాలు నిర్వహించారు. సర్పంచ్ సీతమ్మ, ఏ ఈవో ప్రకాశ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి రైతుబంధు ప్రాముఖ్యతను వివరించారు. కార్యక్రమంలో కార్యదర్శి ఆంజనేయులుగౌడ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
రైతు వారోత్సవాలు
కృష్ణ, జనవరి 6 : మండలకేంద్రంలోని ఐనాపూర్లో గురువారం ఏ ఈవో సునీల్ ఆధ్వర్యంలో రైతుబంధు సంబురాలను పొలాల్లో జరుపుకొన్నా రు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథి గా సర్పంచ్ సావిత్రి హాజరై మాట్లాతూ దేశంలో ఏ సీఎం రైతులను పట్టించుకోలేదని, రైతులకు పెట్టుబడి ఇచ్చి రా జులుగా చేస్తున్న తొలి సీఎం కేసీఆర్ అ ని కొనియాడారు. అన్నదాతల జీవితా ల్లో రైతుబంధు కొత్త వెలుగు నింపుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ. 50వేల కోట్లు జమ అవుతున్న సందర్భంగా రై తు సబురాలు జరుపుకొంటున్నామన్నారు. కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్ద మండలంలో..
దామరగిద్ద, జనవరి 6 : మండలకేంద్రంలో రైతుబంధు సంబురాలను ఎంపీపీ బక్క నర్సప్ప ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల గురించి ఆలోచించే సీఎం కేసీఆర్ ఒక్కరేనని అన్నారు. రైతుబంధు సంబురా ల్లో భాగంగా విద్యార్థులకు ముగ్గులు, వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి వెంకటయ్య, విస్తరణ అధికారి శివజ్యోతి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
మరికల్ మండలంలో..
మరికల్, జనవరి 6 : మండలంలోని మాధ్వార్, చిత్తనూర్, పస్పుల తదితర గ్రామాల్లో రైతుబంధు సంబురాల ను రైతులు ఘనంగా జరుపుకొన్నారు. యాసంగి పంటల కోసం ప్రభుత్వం రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడంతో రైతులు తమ సంతోషన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు పుణ్యశీల, అరుంధ తి, ఉపసర్పంచ్ నర్సింహారెడ్డి, రైతుబంధు సమితి కోఆర్డినేటర్లు రామయ్య, రఘునాథ్రెడ్డి, వ్యవసాయ వాఖ అధికారి శివకుమార్, ఏఈవోలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.