కొండాపూర్, నవంబర్ 24 : దుబాయికి చెందిన బిజినెట్ ఆటోమేషన్ సొల్యుషన్ సేవలందిస్తున్న ఆన్పాసివ్… వినూత్నమైన ఇంటర్నెట్ సేవలను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. గురువారం మాదాపూర్లోని ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కంపెనీ ఫౌండర్, సీఈవో ఆష్ ముఫారెహ్ మాట్లాడుతూ.. ఇంటర్నెట్ రంగంలో అవసరమైన సరికొత్త సేవల్లో మెయిలింగ్ పరిష్కారాలను అందిస్తు ఓ-మెయిల్, సోషల్ నెట్వర్కింగ్కు తోడ్పడేందుకు ఓ-నెట్, వీడియో కాన్ఫరెన్సింగ్ కోసం ఓ-కనెక్ట్ సేవలను పరిచయం చేస్తున్నట్లు చెప్పారు.
ఈ సందర్భంగా కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ అధికారి మహమ్మద్ కమల్ మాట్లాడుతూ..వచ్చే మార్చి లోగా హైదరాబాద్ ఆఫీస్ కోసం మరో 500 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఈ ఆఫీస్లో 500 మంది సిబ్బంది పనిచేస్తుండగా..వచ్చే నాలుగు నెలల్లో ఈ సంఖ్య వెయ్యికి చేరుకోనుందన్నారు.