కాచిగూడ : నియెజకవర్గంలో నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తానని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి కాచిగూడ టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎర భీష్మదేవ్ ఆధ్వర్యంలో డివిజన్లోని ఎస్సీహస్టల్, నింబోలిఅడ్డా తదితర ప్రాంతాల్లో ఆదివారం ఎమ్మెల్యే కాలేరు పర్యటించారు.
స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక ప్రజలు నీటి, డ్రైనేజీ సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వాటిని పరిష్కరించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. పలు బస్తీలలో ఏళ్లనాటి తుప్పుపట్టిన డ్రైనేజీ పైపులైన్ల మూలంగా కలుషిత నీళ్లు వస్తున్నాయని, దీంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఫిర్యాదు చేశారు.
దీనితో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే వాటిని తొలగించి పాత పైపుల స్ధానంలో నూతన పైపులను వేయాలని జలమండలి అధికారులను అదేశించారు. అదే విధంగా బస్తీ ప్రజల సౌకర్యార్థం పలు బస్తీలలో సీసీ రోడ్డు వేయడానికి ప్రతిపాదనలు సిద్దం చేయాలని సూచించారు.
అనంతరం ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ ప్రజల సహాకారంతో నియోజకవర్గంలోని అన్ని బస్తీ, కాలనీలను అభివృద్ధి చేస్తానని, ప్రజల కనీస అవసరాలైన మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదని,పలు డివిజన్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి ప్రణాళికా బద్దంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో సునీల్బిడ్లాన్, డాక్టర్ ఓంప్రకాశ్యాదవ్, అధ్యక్షుడు ఎర భీష్మదేవ్, సదానంద్, మన్నె శ్రీనివావాస్ యాదవ్,పట్లూరి సతీశ్, పి.సంతోశ్ తదితరులు పాల్గొన్నారు.