టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా గ్రామ కమిటీల ఎన్నిక ప్రక్రియ జిల్లాలో ముమ్మరంగా కొనసాగుతున్నది. పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో కమిటీలను ఎన్నుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు.
-నమస్తే తెలంగాణ యంత్రాంగం, సెప్టెంబర్ 14
గాంధారి మండలం ముదెల్లి, సర్వాపూర్, హేమ్లానాయక్ తండా, గౌరారం, సీతాయిపల్లి, మేడిపల్లి గ్రామ కమిటీలను మంగళవారం ఏర్పాటు చేశారు. ముదెల్లి గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఒడ్నాల అంజయ్య, సర్వాపూర్ అధ్యక్షుడిగా చాకలి గంగారాం, హేమ్లానాయక్ తండా అధ్యక్షుడిగా గుగ్లోత్ బిక్యానాయక్, గౌరారం అధ్యక్షుడిగా బైరి సంగమేశ్వర్, సితాయిపల్లి అధ్యక్షుడిగా బొర్ర బాలయ్య, మేడిపల్లి అధ్యక్షుడిగా పిట్ల శ్రీనివాస్ను ఎన్నుకొని నియామక పత్రాలను అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీటీసీ శంకర్నాయక్, ఎంపీపీ రాధా బాలరాం, మాజీ జడ్పీటీసీ తానాజీరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్యంరావు, ఏఎంసీ చైర్మన్ పెద్దబూరి సత్యం, గాంధారి విండో చైర్మన్ పెద్దబూరి సాయికుమార్, నాయకులు ముకుంద్రావు, శివాజీరావు, శ్రీనివాస్, శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.
పిట్లం గ్రామ కమిటీని పార్టీ మండల అధ్యక్షుడు వాసరి రమేశ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా దేవసోత్ రవిచంద్ర, ఉపాధ్యక్షుడిగా ఎనుగండ్ల వెంకట్రాంరెడ్డి, కార్యదర్శిగా ఎర్ర రమేశ్ను ఎంపిక చేశారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్రెడ్డి, విండో చైర్మన్లు శపథంరెడ్డి, నారాయణరెడ్డి, సాయిరెడ్డి, నాయకులు విజయ్, జొన్న శ్రీనివాస్రెడ్డి, రఫీక్, లక్ష్మణ్ యాదవ్, నవీన్ పాల్గొన్నారు.
రామారెడ్డి మండలం పోసానిపేట్ గ్రామ కమిటీని ఎంపీపీ నారెడ్డి దశరథ్రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా టంకరి రవి, ఉపాధ్యక్షుడిగా తెడ్డు దినేశ్, ప్రధాన కార్యదర్శిగా పోతుల సంజీవ్రెడ్డి, కోశాధికారిగా నరేశ్రెడ్డిని ఎన్నుకున్నారు. రైతుబంధు సమితి మండల కన్వీనర్ గురజాల నారాయణరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పడిగెల శ్రీనివాస్, నాయకులు లింబాద్రినాయక్, రంగు రవీందర్గౌడ్, కార్యకర్తలు పాల్గొన్నారు.
లింగంపేట మండలం పర్మళ్ల, రాంపూర్, జల్దిపల్లి గ్రామ కమిటీలను టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దివిటి రమేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పర్మళ్ల గ్రామ కమిటీ అధ్యక్షుడిగా గంట బాబు, రాంపూర్ అధ్యక్షుడిగా ధరావత్ బలరాం, జల్దిపల్లి అధ్యక్షుడిగా అల్లం పోశయ్యను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రూప్సింగ్, సర్పంచ్ పర్వయ్య, నాయకులు గన్నూనాయక్, కిషన్, రవీందర్, అట్టెం శ్రీనివాస్, శ్రీకాంత్, సాయికుమార్ పాల్గొన్నారు.
ఎల్లారెడ్డి మండలం మాచాపూర్ గ్రామ కమిటీని ఎల్లారెడ్డి మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కురుమ రవి, ప్రధాన కార్యదర్శిగా కురుమ అంజయ్యను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు జలంధర్రెడ్డి, ఎంపీటీసీ పడమటి సంతోష్, సర్పంచ్ దాసరి పోచమ్మ, నాయకులు దాసరి సుధాకర్, నర్సింహారెడ్డి, ముత్తి రామప్ప, పాండు, శ్రీను, దశరథం, మండల కో-ఆప్షన్ సభ్యుడు మహమూద్ తదితరులు పాల్గొన్నారు.
నాగిరెడ్డిపేట మండలంలోని మూడు గ్రామాల్లో టీఆర్ఎస్ గ్రామ కమిటీలను పార్టీ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్ధయ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. చిన్న ఆత్మకూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా మంగళి కిషన్, ఉపాధ్యక్షుడిగా కొంపల్లి రవికుమార్, ప్రధాన కార్యదర్శిగా మంగళి కుమార్, జలాల్పూర్ అధ్యక్షుడిగా గడ్డం మాణిక్యంగౌడ్, ఉపాధ్యక్షుడిగా బాంచ గోపాల్, ప్రధాన కార్యదర్శిగా నీరడి సంజీవులు, మాటూర్ అధ్యక్షుడిగా రాయిపల్లి మల్లయ్య, ఉపాధ్యక్షుడిగా పుట్టి సాయిలు, ప్రధాన కార్యదర్శిగా రాయపల్లి బాలకిష్టయ్యను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో పార్టీ మండల ఉపాధ్యక్షుడు దివిటి కిష్టయ్య, కార్యదర్శి మంగళి యాదగిరి, జడ్పీటీసీ మనోహర్రెడ్డి పాల్గొన్నారు.
బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామ టీఆర్ఎస్ అధ్యక్షుడిగా రాజేశ్వర్గౌడ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బాన్సువాడలోని 19 వార్డులకు కమిటీలను నియమించారు. బాధ్యులకు టీఆర్ఎస్ మండల, పట్టణ అధ్యక్షుడు మోహన్నాయక్, పాత బాలకృష్ణ నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో బల్దియా చైర్మన్, వైస్ చైర్మన్లు జంగం గంగాధర్, షేక్ జుబేర్, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ అంజిరెడ్డి, సొసైటీ చైర్మన్, వైస్ చైర్మన్లు కృష్ణారెడ్డి, దాసరి శ్రీనివాస్, కౌన్సిలర్లు పాశం రవీందర్రెడ్డి, లింగమేశ్వర్, శ్రీనివాస్, రఫీ, హైమద్, నాయకులు ఎజాస్, గురువినయ్ కుమార్, కొర్ల పోతారెడ్డి, అలీమొద్దీన్ బాబా, నార్ల ఉదయ్గుప్తా తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి మండలం నందివాడ టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా రాజయ్యతోపాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నామని పార్టీ మండల అధ్యక్షుడు సాయిరెడ్డి తెలిపారు. ఎంపీపీ రవి, వైస్ ఎంపీపీ నర్సింహులు, సీడీసీ చైర్మన్ మహేందర్రెడ్డి, సొసైటీ చైర్మన్ కపిల్రెడ్డి పాల్గొన్నారు.